Mukesh Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యంత విజయవంతమైన వ్యాపారం అంటే ముందుగా ఇంధన రంగంలోని పెట్రోకెమికల్స్ వ్యాపారమనే చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ఆయన రూ.75,000 కోట్లతో మెగా పందెం లాభాలను తెచ్చిపెట్టనుంది.
ముఖేష్ అంబానీ దేశంలో అత్యంత ధనవంతుడు. దాదాపు 17 ట్రిలియన్ రూపాయలకు పైగా మార్కెట్ క్యాప్ కలిగిన దేశంలోని అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్కు నాయకత్వం వహిస్తున్నారు. అంబానీ ఎప్పటికప్పుడు గ్రీన్ ఎనర్జీ గురించి, దాని నుంచి దేశానికి లభించే ప్రయోజనాల గురించి పనిచేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ 2021లో న్యూ ఎనర్జీ వ్యాపారం కోసం రూ.75,000 కోట్ల పెట్టుబడిని ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే గుజరాత్ జామ్నగర్లో 5,000 ఎకరాల్లో విస్తరించి ఉన్న ధీరూభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్ను రిలయన్స్ అభివృద్ధి చేస్తోంది. రాబోయే కాంప్లెక్స్లో సౌర ఫోటోవోల్టాయిక్ గిగా ఫ్యాక్టరీ రాబోతోంది. ఇది అన్ని రకాల వినియోగదారుల కోసం 20 గిగా వాట్(GW) సోలార్ ఫోటోవోల్టాయిక్ గిగా ఫ్యాక్టరీని అందుబాటులోకి తీసుకొస్తోంది. అయితే ఈ సోలార్ ఫోటోవోల్టాయిక్ గిగా ఫ్యాక్టరీ 5 GW చొప్పున 2026 నాటికి మెుత్తంగా నాలుగు దశల్లో ప్రారంభించబడుతుందని నివేదికలు చెబుతున్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ జామ్నగర్ సోలార్ ఫ్యాక్టరీ REC టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. దీనికి ముందు ముఖేష్ అంబానీ 2021లో నార్వే ప్రధాన కార్యాలయమైన REC సోలార్లో 100% వాటాను రూ.5,800 కోట్లకు కొనుగోలు చేశారు. రిలయన్స్ 2030 నాటికి 100GW సౌరశక్తిని స్థాపించి, ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిని నిజం చేయడానికి HJT సెల్ల కోసం అధిక సామర్థ్యం గల ఉత్పత్తి శ్రేణిని కొనుగోలు చేయడానికి కంపెనీ చైనా-ఆధారిత సుజౌ మాక్స్వెల్ టెక్నాలజీస్తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. రానున్న కాలంలో రెన్యూవబుల్ ఎనర్జీ బూమ్ ముఖేష్ అంబానీ పెట్టుబడులు భారీగా లాభాలను తెచ్చిపెడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications