ఆపైల్స్ నుంచి రిటైల్, టెలికాం, శక్తి, పదార్థాలు, జీవశాస్త్రాలు, ఆర్థిక సేవలు, మీడియా వరకు విస్తృత రంగాలలో రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. చైర్మన్ ముకేశ్ అంబానీ ప్రకటన ప్రకారం.. రాబోయే రోజుల్లో రిలయన్స్ అధునాతన తయారీ సామర్థ్యాలతో ఏఐ ఆధారిత డీప్ టెక్ దిగ్గజంగా మారాలని లక్ష్యం పెట్టుకుంది. ముఖేష్ అంబానీ ఇటీవల రిలయన్స్ AI మానిఫెస్టో ముసాయిదాను ఆవిష్కరించారు.
ఈ ప్రణాళిక 6 లక్షలకు పైగా ఉద్యోగుల ఉత్పాదకతను పది రెట్లు పెంచే లక్ష్యంతో రూపొందించడం జరిగింది. అంబానీ ప్రకారం.. ఈ మానిఫెస్టో భారతదేశ ఆర్థిక వ్యవస్థ, సమాజంపై కూడా 10 రెట్లు ప్రభావాన్ని చూపించే విధంగా రూపొందించబడింది. ఈ ప్రణాళిక ద్వారా రిలయన్స్ సమ్మేళనం AI-స్థానిక డీప్-టెక్ సంస్థగా మారి, ఉద్యోగుల పనితీరు, వ్యాపార ఫలితాలు, నూతన ఆవిష్కరణలను నేరుగా ప్రోత్సహించనుందని ఆయన తెలిపారు.

అంబానీ కృత్రిమ మేధస్సును మానవ చరిత్రలో అత్యంత ప్రభావశీల సాంకేతిక అభివృద్ధి అని వివరిస్తూ.. ప్రతి భారతీయుడికి సరసమైన AI అందించడం, భద్రత, నమ్మకం, జవాబుదారీతనాన్ని ఉంచుతూ, వ్యాపారాలలో AIని సులభంగా అనుసరించడం కీలకం అని చెప్పారు. మానిఫెస్టోలోని పార్ట్-I అంతర్గత పరివర్తనపై దృష్టి సారిస్తుంది. ఇందులో AIని కేవలం టెక్నాలజీ ప్రాజెక్ట్గా కాకుండా, ఉద్యోగుల పని విధానాన్ని పూర్తిగా మలిచే సాధనంగా ఉపయోగించబడుతుంది.
రిలయన్స్ లో వర్క్ఫ్లోలను, ముఖ్యంగా ప్రొక్యూర్-టు-పే, ఆర్డర్-టు-క్యాష్, హైర్-టు-రిటైర్, ప్లాంట్-టు-పోర్ట్ వంటి ప్రక్రియలను మాన్యువల్ హ్యాండ్ఆఫ్లను తొలగిస్తూ, రియల్-టైమ్ విజిబిలిటీ, నిర్ణయాలు, నాణ్యతను పెంచే విధంగా పునర్వ్యవస్థీకరిస్తారు. AI, ఏజెంట్ ఆటోమేషన్ ద్వారా పునరావృతమయ్యే పనిని తగ్గించడానికి, చిన్న క్రాస్-ఫంక్షనల్ పాడ్లు ఏర్పాటుచేసి, డేటా, కార్యకలాపాలు, పాలన, అభ్యాసం ఆటోమేషన్ ఫ్లైవీల్స్ ద్వారా అమలును నడిపిస్తారు.
జియో యొక్క 500 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్ బేస్, భారత్లోని అతిపెద్ద రిటైల్ నెట్వర్క్, శక్తి, పదార్థాలు, జీవశాస్త్రాలు, ఆర్థిక సేవలు, మీడియా వంటి విభాగాలలో AIను ఉపయోగించి, వ్యాపారాలు, దాతృత్వ కార్యక్రమాల ద్వారా దేశంపై 10 రెట్లు ప్రభావం చూపగలమని అంబానీ చెప్పారు.
AI ప్రజలను భర్తీ చేయడం కాదు.. కానీ పని ప్రమాణాలను పెంచడం, సంస్థ సామర్థ్యాన్ని విడుదల చేయడం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తొంది. స్వదేశీ AI హార్డ్వేర్, రోబోటిక్స్, క్రాస్-డొమైన్ అప్లికేషన్ల ద్వారా సాంకేతిక స్వావలంబనను ప్రోత్సహిస్తూ, వ్యాపార వృద్ధి, సామాజిక ప్రభావం, భారతదేశ AI విప్లవానికి దోహదం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.ఇక జనవరి 10 నుంచి 26 వరకు ఉద్యోగులను AI ఆలోచనలు సమర్పించమని ఆహ్వానించారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications