ముఖేష్ అంబానీ నేతృత్వంలోని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (JFSL) అండ్ ప్రపంచంలోనే అతిపెద్ద అసెట్ మేనేజ్మెంట్ సంస్థ బ్లాక్రాక్ కలిసి ఏర్పాటు చేసిన జియో బ్లాక్రాక్ అసెట్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్కు భారత మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) నుంచి శుభవార్త అందింది. భారతదేశంలో మ్యూచువల్ ఫండ్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి సెబీ అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ ఆమోదంతో జియో బ్లాక్రాక్ త్వరలోనే దేశీయ మ్యూచువల్ ఫండ్ మార్కెట్లోకి ప్రవేశించి, కోట్లాది మంది భారతీయ పెట్టుబడిదారులకు కొత్త అవకాశాలను అందించడానికి సిద్ధమైంది. అంతేకాదు ఈ వార్త మార్కెట్ వర్గాల్లో తీవ్ర ఉత్సాహాన్ని నింపింది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ షేర్లను కొనుగోలు చేయడానికి పెట్టుబడిదారుల మధ్య పోటీ కూడా నెలకొంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కంపెనీ స్టాక్ బీఎస్ఈ (BSE)లో 3.35% పెరుగుదలతో రూ.291.20 వద్ద ట్రేడవుతోంది.

స్వామినాథన్ నియామకం: జియో బ్లాక్రాక్ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ (MD) అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా సిడ్ స్వామినాథన్ నియమితులయ్యారు. సిడ్ స్వామినాథన్ నేపథ్యం ఈ వెంచర్కు మరింత బలాన్ని చేకూరుస్తోంది. బ్లాక్రాక్లో అంతర్జాతీయ ఇండెక్స్ ఈక్విటీల మాజీ అధిపతి అయిన ఆయన గతంలో $1.25 ట్రిలియన్ల విలువైన ఆస్తులను సమర్థవంతంగా నిర్వహించారు. దీనికి ముందు, ఆయన బ్లాక్రాక్లో యూరప్కు స్థిర ఆదాయ పోర్ట్ఫోలియో నిర్వహణ అధిపతిగా కూడా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన అనుభవం, అంతర్జాతీయ మార్కెట్లపై పట్టు జియో బ్లాక్రాక్కు భారత్లో బలమైన పునాదిని వేయడంలో తోడ్పడతాయి.
బ్లాక్రాక్లో ఇంటర్నేషనల్ హెడ్ రాచెల్ లార్డ్ మాట్లాడుతూ, "నేడు భారతదేశంలో ఆస్తి నిర్వహణలో అవకాశాలు చాలా ఉత్తేజకరమైనవి. జియోబ్లాక్రాక్ డిజిటల్-ఫస్ట్ కస్టమర్ ప్రతిపాదన తక్కువ ఖర్చుతో, అత్యున్నత సంస్థాగత నాణ్యత గల ఉత్పత్తులను నేరుగా పెట్టుబడిదారులకు అందిస్తుంది. మా భాగస్వామి జేఎఫ్ఎస్ఎల్తో కలిసి దేశ ఆర్థిక వృద్ధికి తోడ్పడటానికి ఎదురుచూస్తున్నాము" అని ఆమె పేర్కొన్నారు.
117 కోట్ల పెట్టుబడి: గత జనవరిలో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ బ్లాక్రాక్తో కలిసి ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీలో రూ.117 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు ప్రకటించింది. ఈ జాయింట్ వెంచర్ 50:50 భాగస్వామ్యంతో పనిచేస్తుంది, అంటే రెండు కంపెనీలు సమాన వాటాతో ఉంటాయి. ఒక్కొక్కటి రూ. 5.85 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశాయి, ఒక్కో షేరు ధర రూ. 10. అంతేకాకుండా, ఇరు కంపెనీలు ప్రారంభ మూలధనంగా రూ. 82.5 కోట్లు సమానంగా పెట్టుబడి పెట్టాయి. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ గతంలో 2024 అక్టోబర్ 29న జియో బ్లాక్రాక్ అసెట్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంకా జియో బ్లాక్రాక్ ట్రస్టీ ప్రైవేట్ లిమిటెడ్ అనే రెండు కంపెనీలను ఏర్పాటు చేసినట్లు తెలియజేసింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications