Jio Financial: గడచిన కొన్నేళ్లుగా ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ హుషారుగా వ్యాపారాల విస్తరణ చేపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన ఏజీఎంలోనూ రిటైల్, జ్యూవెలరీ సహా మరిన్ని వ్యాపారాలను విస్తరించాలనే ప్లాన్స్ గురించి వెల్లడించిన సంగతి తెలిసిందే.
అయితే మరోపక్క ముఖేష్ అంబానీ బయటకు పొక్కకుండా తన ఫైనాన్స్ వ్యాపారాన్ని సైతం వేగంగా విస్తరించేందుకు ప్రణాళికలను రచిస్తున్నారు. అవును అంబానీకి చెందిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్కు చెందిన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ జియో ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి ఇన్వెస్టర్లను ఆశ్చర్యానికి గురిచేసే భారీ ప్రకటన వెలువడింది. కంపెనీ ఇండియాలో వేగంగా వృద్ధి చెందుతున్న హోమ్ లోన్ వ్యాపారంలోకి అడుగుపెట్టేందుకు చివరి దశలో ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఇది బీటా వెర్షన్ గా ప్రారంభించబడిందని స్పష్టం చేసింది. త్వరలోనే ఆస్తులపై రుణాలు, సెక్యూర్డ్ లోన్స్ ఉత్పత్తులను పరిచయం చేయనున్నట్లు ప్రకటించింది. ఇది ఫైనాన్స్ రంగంలోని ఇతర కంపెనీలకు గట్టి పోటీని అందించగలదని నిపుణులు భావిస్తున్నారు.

శుక్రవారం జరిగిన ఏజీఎంలో వాటాదారులను ఉద్దేశించి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో హితేష్ సేథియా మాట్లాడుతూ.. తాము ప్రయోగాత్మకంగా ప్రారంభించిన గృహ రుణాలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చివరి దశలో ఉన్నట్లు వెల్లడించారు. జియో ఫైనాన్స్ లిమిటెడ్ ఇప్పటికే సురక్షిత రుణ ఉత్పత్తులైన.. సప్లై చైన్ ఫైనాన్సింగ్, మ్యూచువల్ ఫండ్స్పై రుణాలు, ఎక్విప్మెంట్ ఫైనాన్సింగ్ కోసం ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్ వంటి రుణ ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెట్టిందని సమావేశంలో చెప్పారు. ఇప్పటికే కంపెనీ ఆర్బీఐ నుంచి కీ ఇన్వెస్ట్మెంట్ కంపెనీగా పనిచేయడానికి అవసరమైన అనుమతులను పొందింది.
శుక్రవారం మార్కెట్ల ముగింపు సమయంలో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ ఒక్కోటి రూ.322 స్థాయిల వద్ద ప్రయాణాన్ని ముగించాయి. ఏప్రిల్ 2024లో కంపెనీ షేర్ల ధర రూ.395గా ఉన్న సంగతి తెలిసిందే. ఇది 52 వారాల స్టాక్ గరిష్ఠ ధర అని చెప్పుకోవచ్చు. జూన్ త్రైమాసికంలో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ లాభం 6 శాతం తగ్గి రూ.313 కోట్లకు చేరుకున్న సంగతి తెలిసిందే. గత ఏడాది మార్కెట్లో జాబితా అయిన అంబానీ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్సింగ్, ఇన్సూరెన్స్ బ్రోకింగ్, పేమెంట్స్ బ్యాంక్, పేమెంట్ ప్లాట్ఫారమ్ వంటి అనేక సేవలను ప్రస్తుతం అందిస్తోంది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications