ఛాట్‌ జీపీటీపై అంబానీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..! AI మీకు సమాధానాలు ఇస్తుంది! కానీ..

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హవా నడుస్తోంది. ఛాట్ జీపీటీ (ChatGPT) వంటి టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చాక సమాచారాన్ని పొందడం చాలా సులభమైంది. అయితే ఈ AI యుగంలో అసలైన మేధావి ఎవరు? నిజమైన నాయకుడు ఎలా ఉండాలి? అనే అంశంపై రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఇటీవల విద్యార్థులకు కీలక సందేశాన్ని ఇచ్చారు. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

mukesh ambani comments on chatgpt ai leadership india tech future 2025

గాంధీనగర్‌ లోని పండిట్ దీనదయాళ్ ఎనర్జీ యూనివర్సిటీ (PDEU) 13వ కాన్వొకేషన్ కార్యక్రమంలో పాల్గొన్న అంబానీ, మారుతున్న సాంకేతిక ప్రపంచంలో విద్యార్థులు ఎలా రాణించాలో వివరించారు.

తెలివైన వాడు వర్సెస్ నాయకుడు

AI టెక్నాలజీ గురించి మాట్లాడుతూ అంబానీ ఒక అద్భుతమైన మాట చెప్పారు. "ChatGPT మీకు సమాధానాలను ఇవ్వగలదు.. కానీ, సరైన ప్రశ్నలను అడగడం కేవలం మీ వల్ల మాత్రమే అవుతుంది. ఈ AI యుగంలో ఎక్కువ సమాధానాలు తెలిసిన వ్యక్తి తెలివైన వాడు కావచ్చు. కానీ, అత్యుత్తమ ప్రశ్నలు అడగగలిగే వ్యక్తి మాత్రమే నిజమైన నాయకుడు (Leader) అవుతాడు" అని ఆయన పేర్కొన్నారు. ఏఐ లాంటి టెక్నాలజీలు ఎన్ని వచ్చినా విద్యార్థులు తమ ఆలోచనా శక్తిని, కుతూహలాన్ని ఎప్పటికీ కోల్పోకూడదని ఆయన స్టూడెంట్స్ కు సూచించారు.

ఆర్థిక శక్తికి ఇవే పునాది

చరిత్రను గమనిస్తే.. ఏ దేశమైనా ఆర్థికంగా బలపడాలంటే ఆ దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ పునాదులు బలంగా ఉండాలని అంబానీ అభిప్రాయపడ్డారు. అమెరికా ఈరోజు ప్రపంచ అగ్రరాజ్యంగా ఉందంటే దానికి కారణం అక్కడ ఉన్న ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలేనని ఆయన ఉదహరించారు. గతంలో యూరప్, జపాన్, చైనా దేశాలు ఈ సత్యాన్ని నిరూపించాయని.. ఇప్పుడు భారత్ వంతు వచ్చిందని ఆయన చెప్తూ స్టూడెంట్స్ ను ఉత్సాహపరిచారు.

గ్లోబల్ రేసులో భారత్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, న్యూ ఎనర్జీ వంటి భవిష్యత్తు టెక్నాలజీల్లో ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన పోటీ ఉందని అంబానీ అన్నారు. ఈ రేసులో "జో జీతా వోహీ సికందర్" (ఎవరు గెలిస్తే వారే రాజు) అన్నట్లుగా ఉంటుందని, ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ తప్పకుండా విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. భారత్ ప్రపంచాన్ని మారుస్తుందని, మనం భారత్‌ను మారుద్దామని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

గతంలో వీళ్లు కూడా..

అంబానీ అభిప్రాయంతో ఏకీభవిస్తూ.. గతంలో మరికొందరు కూడా ఏఐ గురించి మాట్లాడారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నీలేకని కూడా AI పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. AI అనేది కేవలం ఒక 'మెకానిస్టిక్' (యంత్ర సంబంధిత) ప్రక్రియ మాత్రమేనని, అది మనుషుల్లో ఉండే సృజనాత్మకత, సానుభూతి (Empathy) మరియు టీమ్ వర్క్ వంటి నైపుణ్యాలను ఎప్పటికీ భర్తీ చేయలేదని ఆయన పేర్కొన్నారు. సాంకేతికత ఎంత పెరిగినా, మౌలిక సూత్రాల నుంచి ఆలోచించే మానవ మేధస్సుకే భవిష్యత్తులో అత్యధిక విలువ ఉంటుందని ఆయన నొక్కి చెప్పారు.
అంతేకాకుండా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా AI పై గతంలో తనదైన శైలిలో స్పందించారు. ప్రపంచం ఎంత డిజిటల్ మయం అయితే.. 'హ్యూమన్ టచ్' (మానవ స్పర్శ) కు అంత ఎక్కువ డిమాండ్ పెరుగుతుందని ఆయన విశ్లేషించారు. AI కేవలం పునరావృతమయ్యే పనులను (Routine tasks) మాత్రమే చేయగలదని, కానీ ఒక వృత్తి నిపుణుడి నైపుణ్యం, చేతిపని మరియు క్లిష్టమైన సమస్యలను పరిష్కరించే నేర్పు ఎప్పటికీ అజేయమని ఆయన అభిప్రాయపడ్డారు. సాంకేతికతను చూసి భయపడటం కంటే, దానిని ఒక సహాయకారిగా మార్చుకుని మన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడమే అసలైన గెలుపు అని ఈ దిగ్గజాలందరి సారాంశం.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+