Mukesh Ambani: దుబాయ్ లో దుమ్మురేపుతున్న అంబానీ.. లగ్జరీ బీచ్ రిసార్ట్ కొనుగోలు..
Mukesh Ambani: ఖరీదైన ఆస్తుల కొనుగోలు విషయంలో తన రికార్డులను తానే బద్ధలు కొడుతున్నారు భారత కుబేరుడు ముఖేష్ అంబానీ. గతంలో చిన్న కొడుకుకోసం దుబాయ్ లో ఒక ఖరీదైన ప్రాపర్టీని కొనుగోలుచేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇదే క్రమంలో మరో సారి వార్తల్లో నిలిచారు.
బీచ్ వ్యూ కోసం..
ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ధనికులు దుబాయ్ కేంద్రంగా ప్రాపర్టీలను కొనుగోలుచేస్తున్న విషయం చూస్తూనే ఉన్నాం. ఈసారి రియలయన్స్ అధినేత అక్షరాలా రూ.1,350 కోట్లను వెచ్చించి కళ్లు చెదిరే భవంతిని కొనుగోలు చేశారు. ప్రస్తుతం దుబాయ్ రియల్టీకి అనేక మంది సంపన్నులు దగ్గరవుతున్నారు. అక్కడి లగ్జరీ బీచ్ హౌసెస్ చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి.
అంతా ప్రైవేట్ గా..
అంబానీ దుబాయ్లోని పామ్ జుమేరియా మాన్షన్లో ఖరీదైన ఆస్తిని కొనటంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఇది వారి పర్ననల్ వ్యవహారం కావటంతో విషయాన్ని ప్రైవేట్ గానే ఉంచినట్లు ఈ వ్యవహారం గురించి తెలిసిన వ్యక్తులు చెబుతున్నారు. ఇది కువైట్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మహ్మద్ అల్షాయా కుటుంబానికి చెందిన విల్లాగా తెలుస్తోంది. రియల్టర్లు సృష్టించిన ఈ చిన్న దీవిలో రిసార్టులు, హోటళ్లు, టవర్లు వంటి అనేక సౌకర్యాలు ఉన్నాయి.
యూరప్ లోనూ కొనుగోళ్లు..
బిలియనీర్ అంబానీ 79 మిలియన్ డాలర్లతో యూకేలోని ఐకానిక్ కంట్రీ క్లబ్ స్టోక్ పార్క్ లో ప్రాపర్టీని కొనుగోలు చేయనున్నట్లు సంచారం. గత ఏడాది కాలంలో ఎమిరేట్స్ ప్రైమ్ ప్రాపర్టీ ధరలు ఏకంగా 70 శాతం పెరిగాయి. ప్రపంచ నలుమూల్లోని ధనవంతుల ఆదరణ కారణంగా ఈ పెరుగుదల ఉందని తేలింది.