Jio Financial: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కంపెనీలో పెట్టుబడి పెట్టాలని చాలా మంది ఇన్వెస్టర్లు ఆలోచిస్తుంటారు. ఈ క్రమంలో ఇటీవల డీమెర్జ్ అయి ప్రత్యేకంగా ఏర్పడిన జియో ఫైనాన్షియల్ పై అందరి దృష్టి ప్రస్తుతం ఉంది.
ఈ క్రమంలో వరుస నష్టాల తర్వాత ట్రేడింగ్ మెుదలు పెట్టిన జియో ఫైనాన్షియల్ లిమిటెడ్ కంపెనీల షేర్ల కోసం కేవలం రిటైల్ ఇన్వెస్టర్లు మాత్రమే కాక మ్యూచువల్ ఫండ్ కంపెనీలు సైతం ఎగబడుతున్నాయని వెల్లడైంది. తాజాగా శుక్రవారం నాడు దేశీయ మ్యూచువల్ ఫండ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ అంబానీకి చెందిన కొత్త కంపెనీలో 3.72 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది. ఈ డీల్ ప్రకారం ఒక్కో షేరును రూ.202.80 వద్ద కొంది. ఇందుకోసం రూ.754.41 కోట్లను వెచ్చించింది.

ఇంత భారీ డీల్ జరిగిన తర్వాత ఇంట్రాడేలో జియో ఫైనాన్షియల్ స్టాక్ తిరిగి పుంజుకుంది. నష్టాల నుంచి తేరుకుని దాదాపు 3.82 శాతం లాభపడి చివరికి శుక్రవారం ఎన్ఎస్ఈలో స్టాక్ రూ.221.60 రేటు వద్ద ట్రేడింగ్ ముగించింది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్(JFSL) ఆగస్ట్ 21న స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ చేయబడింది. అయితే శుక్రవారం ఆర్థిక సేవల సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ BSEలో రూ.1.35 లక్షల కోట్లకు చేరువైంది.
సెన్సెక్స్, ఇతర BSE సూచీల నుంచి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ తొలగింపు మరో మూడు రోజుల పాటు వాయిదా పడింది. దీంతో తొలగింపు సెప్టెంబర్ 1న జరగనుందని తెలుస్తోంది. ఎందుకంటే ఆగస్టు 24, 25 రెండింటిలోనూ స్టాక్ లోయర్ సర్క్యూట్ను తాకిందని S&P డౌ జోన్స్ ఇండిసెస్ వెల్లడించింది. దీనికి ముందు JFSL షేర్లు నిఫ్టీ 50, సెన్సెక్స్ నుంచి ఆగష్టు 24న తొలగించబడతాయని ముందుగా నిర్ణయించబడింది. స్టాక్ దిగువ సర్క్యూట్ను తాకడం వలన అది తొలుత ఆగస్టు 29కి వాయిదా వేయబడింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications