న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకూ పెరుగుతోన్న ఇంధన ధరల ప్రభావం రవాణా రంగంపై పడటం ఆరంభమైంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని చమురు సంస్థలు మోపుతోన్న భారాన్ని రవాణా రంగం ఏ మాత్రం మోయలేకపోతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా సరుకుల రవాణా ఛార్జీలను పెంచేస్తోన్నాయి. దీని ప్రభావం అటు తిరిగి, ఇటు తిరిగి మళ్లీ సామాన్యుడిపైనే పడుతోంది. ఇది ఒక్క రవాణా రంగానికి మాత్రమే పరిమితం అయ్యేలా కనిపించట్లేదు. రవాణా సహా పరిశ్రమలు, వ్యవసాయం వంటి కీలక సెక్టార్లపై పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల దుష్ప్రభావం పడటం ఖాయం.

డీజిల్ ఎఫెక్ట్..
దేశవ్యాప్తంగా డీజిల్ ధర వంద రూపాయల ల్యాండ్మార్క్కు చేరువ అవుతోంది. శ్రీగంగానగర్ వంటి పట్టణాల్లో ఈ మార్క్ను దాటేసింది కూడా. దేశ ఆర్థిక రాజధాని ముంబై సహా అనేక మెట్రో నగరాలు, మధ్యస్థాయి పట్టణాల్లో డీజిల్ ధర 90 నుంచి 100 రూపాయల్లోపు ఉంటోంది. పెట్రో రేట్ల పెంపుదలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా బీజేపీయేతర పార్టీలు నిరసన ప్రదర్శనలకు దిగుతోన్నప్పటికీ చమురు కంపెనీలు వాటిని ఏ మాత్రం పట్టించుకోవట్లేదనేది రోజువారీ పెంపుదలతో స్పష్టమౌతోంది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తాజాగా చేసిన సవరణల ప్రకారం- పెట్రోల్పై 35 పైసలు, డీజిల్పై 26 పైసల మేర పెంపుదల కనిపించింది.

రవాణా రంగం కుదేల్..
డీజిల్ను వినియోగించే రవాణారంగం దీని దెబ్బకు కుదేల్ అవుతోంది. ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లు సరుకుల రవాణా ఛార్జీలను పెంచేస్తోన్నారు. ఫలితంగా- సరుకుల రవాణాతో ముడిపడి ఉన్న అన్ని నిత్యావసర సరుకులు, వ్యవసాయోత్పత్తులు, పాలు, వంటనూనె.. ఇలా దాదాపు సామాన్యుడి ప్రాథమిక అవసరాలకు సంబంధించిన ఆహార వస్తువుల రేట్లు క్రమంగా పెరుగుదల బాట పట్టాయి. రవాణా ఛార్జీల భారాన్ని తట్టుకోవడానికి మదర్ డెయిరీ.. తన పాల రేట్లను పెంచేసింది. లీటర్ ఒక్కింటికి రెండు రూపాయల మేర పెంచింది. పెంచిన పాల రేట్లు ఆదివారం అమల్లోకి వస్తాయని తెలిపింది.

35 లక్షల లీటర్ల పాలు
దేశవ్యాప్తంగా రోజూ 35 లక్షల లీటర్లకు పైగా మదర్ డెయిరీ పాలు విక్రయమౌతోన్నాయి. ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్, కోల్కత, నాగ్పూర్, బెంగళూరు వంటి నగరాల్లో లీడింగ్ మిల్క్ వెండార్గా ఉంటోంది మదర్ డెయిరీ. ఢిల్లీ-ఎన్సీఆర్ 25 లక్షల వరకు మదర్ డెయిరీ పాలు విక్రయమౌతోన్నాయి. ఈ స్థాయిలో పాలను రవాణా చేయడానికి అవసరమైన ఛార్జీల భారం అధికమౌతోందని, ఉత్పత్తి వ్యయం తడిచి మోపెడవుతోందని మదర్ డెయిరీ తెలిపింది. నాలుగు వారాల్లో ఉత్పాదక వ్యయం నాలుగు శాతం మేర పెరిగిందని స్పష్టం చేసింది. ఈ పరిస్థితిని అధిగమించడానికి పాల రేట్లను పెంచాల్సి వచ్చిందని స్పష్టం చేసింది.

సవరించిన రేట్లివీ..
సవరించిన రేట్ల ప్రకారం.. బల్క్ వెండెడ్ మిల్క్ (టోకెన్ మిల్క్) లీటర్ ఒక్కింటికి 44 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం ఈరకం పాల ధర 42 రూపాయలు ఉంటోంది. ఆదివారం నుంచి 44 రూపాయలకు చేరుతుంది. ఫుల్ క్రీమ్ మిల్క్ 55 నుంచి 57 రూపాయలు, ఫుల్ క్రీమ్ ప్రీమియం మిల్క్-అర్ధ లీటరు 30 నుంచి 31 రూపాయలు, టోన్డ్ మిల్క్- లీటర్ ఒక్కింటికి 45 నుంచి 47 రూపాయలు, డబుల్ టోన్డ్ మిల్క్- లీటర్ 39 నుంచి 41 రూపాయలకు పెరిగింది. ఆవు పాలు లీటర్ 47 నుంచి 49 రూపాయలు, సూపర్-టీ మిల్క్ అర్ధలీటర్ 25 నుంచి 26 రూపాయలు, స్టాండరైజ్డ్ మిల్క్- లీటర్ 49 నుంచి 51 రూపాయలకు పెరిగింది. పెరిగిన రేట్లన్నీ రేపటి నుంచి అమల్లోకి వస్తాయి.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications