సామాన్యులకు పెద్ద ఉపశమనం లభించింది. ధార బ్రాండ్ పేరుతో ఎడిబుల్ ఆయిల్ విక్రయిస్తున్న మదర్ డెయిరీ.. ఎడిబుల్ ఆయిల్ ఎంఆర్ పీని లీటర్ కు రూ.15 నుంచి 20 వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. వచ్చే వారం నుంచి తగ్గిన ధరలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది.
మంగళవారం, ఆహార మంత్రిత్వ శాఖ ఎడిబుల్ ఆయిల్ అసోసియేషన్ (SEA) ను ఎడిబుల్ ఆయిల్ ధరలను తగ్గించాలని ఆదేశించింది. ఆ తర్వాత మేడే డైరీ ఎడిబుల్ ఆయిల్ ధరలను తగ్గించింది.
అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గుముఖం పట్టడంతోపాటు దేశీయ పంటల ఉత్పత్తి మెరుగ్గా ఉండడంతో అన్ని రకాల ఎడిబుల్ ఆయిల్ ధరలను తక్షణమే లీటరుకు రూ.15 నుంచి 20 వరకు తగ్గించాలని నిర్ణయించినట్లు మదర్ డెయిరీ ప్రతినిధి తెలిపారు. సోయాబీన్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, వేరుసెనగ నూనె ధరలను కూడా తగ్గించింది. ధార రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్ లీటర్ పాలీప్యాక్ ధర రూ.170 నుంచి రూ.150కి తగ్గింది.

రైస్ బ్రాన్ ఆయిల్ లీటర్ ధర రూ.190 నుంచి రూ.179కి తగ్గింది. ధారా సన్ఫ్లవర్ ఆయిల్ ధర రూ.175 నుంచి రూ.160కి తగ్గింది. వేరుశెనగ నూనె ధర రూ.255 నుంచి రూ.240కి తగ్గింది. సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కూడా తన సభ్యులను గత మూడు నెలల్లో ధర తగ్గింపు వివరాలను ఆహార మంత్రిత్వ శాఖకు సమర్పించాలని కోరింది. అంతకుముందు, ఆహార సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎడిబుల్ ఆయిల్ తయారీ కంపెనీలను ఎడిబుల్ ఆయిల్ ధరలను తగ్గించాలని కోరింది.
అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గినప్పటికీ ప్యాకేజ్డ్ ఫుడ్ ధరల కంటే చమురు ధరలు తగ్గించలేదని మంత్రిత్వ శాఖ చెబుతోంది. వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా ఎడిబుల్ ఆయిల్ ఎంఆర్పిని తగ్గించాలని సెల్వెంట్ ఎక్స్ట్రాక్ట్ అసోసియేషన్ సభ్యులను ప్రభుత్వం కోరింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications