Suzlon Stock: సుజ్లాన్ స్టాక్ రేటింగ్ మార్చిన బ్రోకరేజ్.. కొత్త టార్గెట్ ధర ఇదే..
Suzlon Energy Stock: దేశీయ రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో సుజ్లాన్ స్టాక్ తన నిరంతర పరుగును కొనసాగిస్తూనే ఉంది. ఈక్రమంలో కంపెనీ షేర్లు చాలా కాలంగా ర్యాలీని కొనసాగిస్తున్నాయి. అయితే ఈ క్రమంలో ప్రఖ్యాత గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ కంపెనీ షేర్ల రేటింగ్ తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో నేడు సుజ్లాన్ షేర్లు స్వల్ప నష్టంతో ప్రయాణాన్ని మార్కెట్లో ముగించాయి.
సుజ్లాన్ ఎనర్జీ షేర్లు మోర్గాన్ స్టాన్లీ ద్వారా దాని మునుపటి రేటింగ్ "అధిక బరువు" నుండి 'ఈక్వల్ వెయిట్'కి డౌన్గ్రేడ్ చేయబడిన తర్వాత స్వల్పంగా పడిపోయాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ బ్రోకరేజ్ విండ్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రొవైడర్ స్టాక్ టార్గెట్ ధరను గతంలో ఇచ్చిన రూ.73 నుంచి రూ.88కి పెంచుతున్నట్లు ప్రకటించింది. గడచిన ఆరు నెలల కాలంలో కంపెనీ షేర్లు 110 శాతానికి పైగా పెరుగుదలను నమోదు చేశాయి. కంపెనీ బలమైన ఆర్డర్ బుక్, మెరుగైన బ్యాలెన్స్ షీట్తో పాటు కార్యకలాపాల నుంచి నగదు ప్రవాహాల కారణంగా ఈ అవుట్పెర్ఫార్మెన్స్ని మోర్గాన్ స్టాన్లీ గుర్తించింది.

కంపెనీ ఆర్డర్ బుక్ ప్రస్తుతం ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి 5 గిగావాట్లకు సమీపంలో కొనసాగుతోంది. దేశంలో విండ్ ఎనర్జీ రంగంలో వస్తున్న వ్యాపారాన్ని కంపెనీ అందిపుచ్చుకోవటంలో మెుదటి స్థానంలో ఉందని బ్రోకరేజ్ వెల్లడించింది. ఈ క్రమంలో దాని మార్కెట్ వాటాను 35-40 శాతానికి పెంచుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. పునరుత్పాదక శక్తి స్థలంలో ఆర్డరింగ్ యాక్టివిటీ బలంగా ఉన్నందున బ్రోకరేజ్ FY25-30లో 32 GW కొత్త ఆర్డర్లు వస్తాయని భావిస్తోంది. కంపెనీ ఇటీవలి కాలంలో ప్రభుత్వ యాజమాన్యంలోని ఎన్టీపీసీ అనుబంధ సంస్థ నుంచి సైతం మెగా ఆర్డర్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
నేడు ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో.. సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్ షేర్లు వరుసగా మూడో సెషన్లోనూ నష్టాలను కొనసాగించాయి. ఈ క్రమంలో షేర్ల ధర 1.57 శాతం పతనమై రూ.80.52 వద్ద రోజు కనిష్ట స్థాయిని చేరుకుంది. అయితే మార్కెట్లు ముగిసే సమయంలో ఒక్కో షేరు ధర ఎన్ఎస్ఈలో రూ.81.09 వద్ద స్వల్ప నష్టంతో స్థిరపడ్డాయి. ప్రస్తుతం కంపెనీ షేర్లు తమ 52 వారాల గరిష్ఠ ధర రూ.86.04కు అతి చేరువలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. వాస్తవానికి కంపెనీ షేర్లు సెప్టెంబర్ 12న ఈ గరిష్ఠాన్ని అందుకున్నాయి. అయినప్పటికీ కంపెనీ తన పెట్టుబడిదారులకు 2024లో మల్టీ బ్యాగర్ రాబడులను అందించింది. భవిష్యత్తులో కంపెనీ షేర్లు మరిన్ని కొత్త చారిత్రాత్మక గరిష్ఠాలకు చేరుకునే అవకాశం ఉందని ఇప్పటికే పలు బ్రోకరేజ్ సంస్థలు అంచనాలు వెల్లడించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications