మార్కెట్లు వరుసగా నష్టపోతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో కోల్పోతున్నారు. ఈ వారంలో సోమవారం నుండి గురువారం వరకు 4 రోజుల్లోనే ఇన్వెస్టర్లు రూ.19.49 లక్షల కోట్లు నష్టపోయారు. అంతకుముందు రెండు రోజుల్లోనే రూ.11 లక్షల కోట్లు నష్టపోయిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా 10వేల మందికి పైగా చనిపోగా, రెండున్నర లక్షల మందికి సోకింది. ఇందులో 90 వేల మంది వరకు కోలుకున్నారు.

నాలుగు రోజుల్లోనే అపార నష్టం
కరోనా కేసులు ప్రపంచవ్యాప్తంగా.. అలాగే దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. షేర్లను అమ్ముకునేందుకు ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు. దీంతో మార్కెట్లలో వరుస పతనాలు నమోదవుతున్నాయి. గురువారం (మార్చి 19) పతనంతో వరుసగా 4 రోజులు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతోనే ముగిశాయి. దీంతో రూ.19,49,461.82 కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది.

భారీగా తగ్గుతున్న లిస్టెడ్ కంపెనీల మార్కెట్ వ్యాల్యూ
బీఎస్ఈలో నమోదైన లిస్టెడ్ కంపెనీల మార్కెట్ వ్యాల్యూ రూ.19,49,641.82 కోట్లు తగ్గి రూ.1,09,76,781 కోట్లకు దిగజారింది. నాలుగు రోజుల్లో సెన్సెక్స్ 5,815.25 పాయింట్లు నష్టపోయింది. 30 షేర్ బీఎస్ఈ ఇండెక్స్ గురువారం 581.28 పాయింట్ల వద్ద క్లోజైంది. నాలుగు రోజుల్లో ఈ బెంచ్ మార్క్ ఇండెక్స్ 5,815.25 పాయింట్లు పడిపోయింది.

ఏడాది కనిష్టానికి..
అంతర్జాతీయ మార్కెట్లు భారీ నష్టాల్లోకి వెళ్లడం మనంపై ఎక్కువగా ప్రభావం చూపుతోందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ వరుసగా 3.70 శాతం, 4.53 శాతం పడిపోయింది. బీఎస్ఈలో గురువారం నాడు 1,828 కంపెనీలు నష్టాల్లో, 574 కంపెనీలు లాభాల్లో ఉండగా, 146 కంపెనీల్లో మార్పు లేదు. ఇందులో దాదాపు 1200 కంపెనీలు ఏడాది కనిష్టానికి చేరుకున్నాయి.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో కొబ్బరి నీళ్లు రూ. 180.. మరి హైదరాబాద్ లో ఎంతంటే..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications