Moody's: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక అనిశ్చితి మధ్య భారత ఆర్థిక వ్యవస్థ ఓ బ్రైట్ స్పాట్ అంటూ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఇటీవల కామెంట్ చేసిన విషయం తెలిసిందే. పలు రేటింగ్ సంస్థలు సైతం దాదాపు ఇదే విషయాన్ని ప్రకటించాయి. అయితే మారుతున్న దేశీయ, అంతర్జాతీయ సమీకరణాల దృష్ట్యా.. గతంలో ఇచ్చిన వృద్ధి అంచనాలను సవరిస్తున్నాయి.
భారత ఆర్థిక వ్యవస్థ జూన్ త్రైమాసికంలో 6 నుంచి 6.3 శాతం మేర వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నట్లు ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయాలు ఆశించిన దానికంటే తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని వెల్లడించింది. వారం క్రితం రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన వృద్ధి అంచనా 8 శాతంతో పోలిస్తే మూడీస్ అంచనా చాలా తక్కువగా ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

2022-23లో సాధారణ ప్రభుత్వ రుణం GDPలో దాదాపు 81.8 శాతం ఉంటుందని ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అసోసియేట్ మేనేజింగ్ డైరెక్టర్ జీన్ ఫాంగ్ తెలిపారు. తద్వారా దేశం తక్కువ రుణ స్తోమత కలిగి ఉంటుందని పేర్కొన్నారు. అయితే అధిక అభివృద్ధి సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు వెల్లడించారు.
"ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారతదేశ వృద్ధి 6 నుంచి 6.3 శాతంగా ఉంటుందని ఆశిస్తున్నాము. 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో నమోదైన 6.1 శాతానికి దాదాపు సమానంగా ఉంది" అని ఫాంగ్ చెప్పారు. "Baa3"-రేటెడ్ సార్వభౌమాధికారిగా భారతదేశ ఆస్తులు అధిక అభివృద్ధి సామర్థ్యంతో స్పష్టంగా ఉన్నాయన్నారు. రెండేళ్లుగా ఆర్థిక లక్ష్యాలను సాధించడం ద్వారా కొంత ఆందోళనలు తగ్గాయని పేర్కొన్నారు. 2021-22లో GDPలో 6.7 శాతం ఉన్న ప్రభుత్వ వ్యయం మరియు రాబడి మధ్య వ్యత్యాసం.. 2022-23లో 6.4 శాతానికి తగ్గడం శుభసూచకం.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications