Manmohan Singh: ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ 2016లో అతిపెద్ద సమచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా చెలామణిలో ఉన్న డబ్బును వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో పెద్ద నోట్లను చెలామణి నుంచి డీమానిటైజేషన్ ప్రక్రియ ద్వారా తీసుకుని దానికి బదులుగా కొత్త కరెన్సీ నోట్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. నేరుగా ప్రధాని మోదీ ఈ విషయాన్ని ప్రజలకు మీడియా ద్వారా అప్పట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే దేశంలో బ్లాక్ మనీ, డీమానిటైజేషన్ అంశాలపై దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అప్పట్లో కీలక వ్యాఖ్యలు చేసిన చేశారు. మోదీ సర్కార్ తీసుకున్న సడన్ నిర్ణయంపై అప్పుడు ఆయన ఏమన్నారో ఇప్పుడు ఒకసారి పరిశీలిస్తే.. దేశంలోని పరిస్థితి బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వంపై శక్తివంతమైన నేరారోపణగా పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వ హయాంలో సృష్టించిన ఉద్యోగాల డేటాపై, ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం వెల్లడించిన సంఖ్యలు సందేహాస్పదంగా ఉన్నాయని మన్మోహన్ సింగ్ అన్నారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కల్పనను సమర్థిస్తూ మోదీ ప్రభుత్వం చెబుతున్న లెక్కలు ప్రజలను ఆకట్టుకోలేకపోతున్నాయని అప్పట్లో సింగ్ అభిప్రాయపడ్డారు.

ఈ క్రమంలో మోదీ సర్కార్ అప్పట్లో చేపట్టిన డీమానిటైజేషన్ ఒక చారిత్రాత్మకమైన తప్పిదంగా మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. దీనిని సరిగా అమలు చేయటంలో బీజేపీ ప్రభుత్వం విఫలం కావటం వల్ల చాలా మంది ప్రజలు తమ ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ దేశంలోనైనా ప్రజలు తాము బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసి వాటిని తిరిగి వెనక్కి తీసుకోలేని పరిస్థితులు ఉన్నాయా అంటూ కూడా ప్రశ్నించారు. సామాన్య ప్రజలు ఆ సమయంలో బ్యాంకులు, ఏటీఎంల వద్ద గంటల తరబడి బారులు తీరి నిల్చువాల్సిన పరిస్థితులు రావటానికి సరైన ప్రణాళిక లేకుండా డీమానిటైజేషన్ ప్రకటించటమే కారణంగా మన్మోహన్ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో దాదాపు పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలను సైతం కోల్పోయిన సంఘటనలు మనం చూశాం.
నల్లధనాన్ని రూపుమాపటంతో పాటు ఉగ్రవాదాన్ని అడ్డుకోవటంలో డీమానిటైజేషన్ దోహదపడుతుందని మోదీ సర్కార్ చెప్పిన మాటలతో కొంత ఏకీభవించినప్పటికీ దానిని చేపట్టిన విధానం బాగోలేదని సింగ్ అన్నారు. ఆ సమయంలో 500, 1000 నోట్లను ఆర్థిక వ్యవస్థ నుంచి తొలగిస్తూ తీసుకున్న నిర్ణయం గ్రామీణ భారతీయ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని అన్నారు. అలాగే మోదీ ప్రజలను సంయమనం పాటించాలని 50 రోజుల్లో సాధారణ పరిస్థితులు వస్తాయని పేర్కొనటాన్ని తప్పుపట్టారు. పేద ప్రజలు తమ అవసరాల కోసం 50 రోజుల వరకు వేచి ఉండటం ఎలా కుదురుతుందని మన్మోహన్ రాజ్యసభలో ప్రస్థావించారు. ప్రధానంగా స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీ మోదీ సర్కార్ తీసుకున్న అకస్మాత్తు డీమానిటైజేషన్ నిర్ణయం వల్ల భారీగా నష్టపోయిందని పేర్కొన్నారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications