ఈపీఎఫ్వో దీపావళి కానుకను ప్రకటించనుందని తెలుస్తోంది. ప్రస్తుతం అందిస్తోన్న పెన్షన్ను రెట్టింపు చేయాలని కార్మిక శాఖ ప్రతిపాదన చేసింది. ఇందుకు ఆర్థిక శాఖ కూడా సుముఖంగా ఉందని తెలుస్తోంది. త్వరలో దీనిపై ప్రకటన రావొచ్చునని భావిస్తున్నారు. ఇదే జరిగితే ప్రస్తుతం రూ.వెయ్యిగా ఉన్న పెన్షన్ రూ.2వేలకు పెరగనుంది. దీంతో యాభై లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుంది.

అలా అయితే ప్రకటన వెలువడవచ్చు
మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు దీపావళి బహుమతిని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈపీఎఫ్వో రూల్స్ ప్రకారం ప్రయివేటురంగ కంపెనీలు తమ ఉద్యోగులకు ఈఫీఎఫ్ ఖాతాలో ఉద్యోగుల వాటా నుండి 12 శాతం, కంపెనీ వాటాగా 12 శాతం జమ చేస్తాయి. కంపెనీకి చెందిన 12 శాతం వాటాలో 8.33 శాతం ఉద్యోగుల పెన్షన్ స్కీం(EPS)కు వెళ్తుంది.
ఈ పండుగ సమయంలో పెన్షన్ బహుమతిని కేంద్రం ఇచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. కనీస పెన్షన్ పెంపుకు ఆర్థిక శాఖ కూడా దీనికి సుముఖంగా ఉందట. అదే జరిగితే త్వరలో పెన్షన్ రెట్టింపుకు సంబంధించి ప్రకటన వెలువడవచ్చు.

లక్షలమందికి ప్రయోజనం
సమాచారం మేరకు కనీస పెన్షన్ స్కీం రూ.1000 నుండి రూ.2000కు పెరగవచ్చు. 2019లో దీనికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్(CBT) ఆమోదం తెలిపింది. పెన్షన్ను రూ.2వేల నుండి రూ.3వేలకు పెంచాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చాలా రోజులుగా డిమాండ్ చేస్తోంది. పెన్షన్ రెట్టింపు అయితే ప్రభుత్వం మరో రూ.2 నుండి రెండున్నర కోట్ల రూపాయల చెల్లించాల్సి వస్తుంది. దీని ద్వారా లక్షలమంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది.

ఈపీఎఫ్ ఖాతాదారులకు 8.5 శాతం వడ్డీ
కాగా, ఈపీఎఫ్ ఖాతాదారులకు 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను చెల్లించిన ఈపీఎఫ్ వడ్డీని దీపావళి నాటికి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మేరకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ తెలిపింది. ఈపీఎఫ్ ఖాతాదారులకు 8.5 శాతం వడ్డీని అందించనున్నట్లు లాక్ డౌన్ సమయంలో ఈపీఎఫ్ఓ ప్రకటించింది. అయితే ఈ వడ్డీ డబ్బును రెండు విడతలుగా పీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలో జమ చేయాలని నిర్ణయం తీసుకుంది. తాజాగా ఇందులో మార్పు చేసి ఒకేసారి మొత్తం వడ్డీ నగదును ఈపీఎఫ్ ఖాతాదారులకు అందించనున్నారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications