Crude Oil News: ప్రతి 15 రోజులకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం విండ్ ఫాల్ టాక్స్ రేట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే నెల మెుదటి తారీఖున ఎన్నికల తరుణంలో తగ్గింపుల ప్రకటన కార్పొరేట్ కంపెనీలకు పెద్ద ఊరటను ఇచ్చే అంశంగా కొనసాగుతోంది.
దేశీయంగా ఉత్పత్తి చేసే ముడిచమురుపై విండ్ ఫాల్ ట్యాక్స్ను కేంద్ర ప్రభుత్వం నేడు టన్నుకు రూ.9,600 నుంచి రూ.8,400కి తగ్గిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీ(SED) రూపంలో దేశంలో విధించబడుతోంది. అంతకుముందు ఏప్రిల్ 16న, ప్రభుత్వం ముడి చమురుపై విండ్ఫాల్ పన్నును మెట్రిక్ టన్నుకు రూ.6,800 నుంచి రూ.9,600కి పెంచిన సంగతి తెలిసిందే.

ఏప్రిల్ 4న ప్రభుత్వం పెట్రోలియం క్రూడ్పై విండ్ఫాల్ పన్నును మెట్రిక్ టన్నుకు రూ.4,900 నుంచి రూ.6,800కి పెంచింది. అంతకుముందు మార్చి 15, 2024న దేశీయ ముడి చమురు అమ్మకాలపై విండ్ఫాల్ పన్నును ఆర్థిక మంత్రిత్వ శాఖ టన్నుకు రూ.4,900గా నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుత నోటిఫికేషన్ ప్రకారం డీజిల్, పెట్రోల్, విమాన ఇంధనం ఎగుమతిపై జీరో పన్నును కొనసాగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. కొత్త రేట్లు మే 1 నుంచి అమల్లోకి వచ్చాయి. జూలై 1, 2022న భారత ప్రభుత్వం తొలిసారిగా విండ్ఫాల్ లాభాలపై పన్నును విధించటం మెుదలుపెట్టింది. దీంతో ఇంధన కంపెనీల అసాధారణ లాభాలపై పన్ను విధించే దేశాల జాబితాలో చేరింది. గత రెండు వారాల చమురు ధరల సగటు ఆధారంగా ప్రతి పదిహేను రోజులకు పన్ను రేట్లను కేంద్ర ప్రభుత్వం సమీక్షిస్తుందని తెలిసిందే.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications