Crude Oil News: ప్రతి 15 రోజులకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం విండ్ ఫాల్ టాక్స్ రేట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే నెల మెుదటి తారీఖున ఎన్నికల తరుణంలో తగ్గింపుల ప్రకటన కార్పొరేట్ కంపెనీలకు పెద్ద ఊరటను ఇచ్చే అంశంగా కొనసాగుతోంది.
దేశీయంగా ఉత్పత్తి చేసే ముడిచమురుపై విండ్ ఫాల్ ట్యాక్స్ను కేంద్ర ప్రభుత్వం నేడు టన్నుకు రూ.9,600 నుంచి రూ.8,400కి తగ్గిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీ(SED) రూపంలో దేశంలో విధించబడుతోంది. అంతకుముందు ఏప్రిల్ 16న, ప్రభుత్వం ముడి చమురుపై విండ్ఫాల్ పన్నును మెట్రిక్ టన్నుకు రూ.6,800 నుంచి రూ.9,600కి పెంచిన సంగతి తెలిసిందే.

ఏప్రిల్ 4న ప్రభుత్వం పెట్రోలియం క్రూడ్పై విండ్ఫాల్ పన్నును మెట్రిక్ టన్నుకు రూ.4,900 నుంచి రూ.6,800కి పెంచింది. అంతకుముందు మార్చి 15, 2024న దేశీయ ముడి చమురు అమ్మకాలపై విండ్ఫాల్ పన్నును ఆర్థిక మంత్రిత్వ శాఖ టన్నుకు రూ.4,900గా నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుత నోటిఫికేషన్ ప్రకారం డీజిల్, పెట్రోల్, విమాన ఇంధనం ఎగుమతిపై జీరో పన్నును కొనసాగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. కొత్త రేట్లు మే 1 నుంచి అమల్లోకి వచ్చాయి. జూలై 1, 2022న భారత ప్రభుత్వం తొలిసారిగా విండ్ఫాల్ లాభాలపై పన్నును విధించటం మెుదలుపెట్టింది. దీంతో ఇంధన కంపెనీల అసాధారణ లాభాలపై పన్ను విధించే దేశాల జాబితాలో చేరింది. గత రెండు వారాల చమురు ధరల సగటు ఆధారంగా ప్రతి పదిహేను రోజులకు పన్ను రేట్లను కేంద్ర ప్రభుత్వం సమీక్షిస్తుందని తెలిసిందే.
More From GoodReturns

బంగారం ధరల పెరుగుదలపై దిమ్మతిరిగే న్యూస్.. గత చరిత్రతో కీలక నివేదికను విడుదల చేసిన Kedia Advisory

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

Bengaluru: టీసీఎస్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! మీ స్నేహితుడిని చేర్పించండి.. రూ. 40,000 గెలుచుకోండి!

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

Gold: బంగారం ధరలు తగ్గేది అందుకు కాదు! అసలు విషయం బయటపెట్టిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీఈఓ!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

పెరుగుతున్న బంగారం ధరలు.. అదే స్థాయిలో పెరుగుతున్న పసిడి రుణాలు.. ఎందుకు తాకట్టు పెడుతున్నారు..

బంగారం ధర పెరగడంతో వినియోగదారులు కొత్త స్కెచ్.. రూ.4 లక్షల కోట్లు దాటిన పసిడి రుణాలు..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బెంగళూరు-హైదరాబాద్ మధ్య ప్రయాణం గంటలే.. 110 కి.మీ.వేగంతో కొత్త రైలు వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..



Click it and Unblock the Notifications