PM Kisan Yojana: ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే ఏడాది లోక్ సభ ఎన్నికలకు ముందు రైతుల కోసం ఇందులో కీలక ప్రకటన ఉంటుందని తెలుస్తోంది.
2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది రైతులకు బడ్జెట్ తాయిలాన్ని ప్రకటించనుందని సమాచారం. వాస్తవానికి పీఎం కిసాన్ యోజన కింద అందిస్తున్న సహాయాన్ని రూ.6000 నుంచి రూ.8000లకు పెంచే ఆలోయనలో బీజేపీ ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. దీనికి తోడు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద కేటాయింపులను పెంచే అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన(PMGKAY) వాయిదాల పెంపుపై తుది నిర్ణయం త్వరలో తీసుకోబడుతుందని ప్రముఖ వార్తా సంస్థ వెల్లడించింది. ఫిబ్రవరి-మార్చి 2024 మధ్య పీఎం-కిసాన్ యోజన 16వ విడతను ప్రభుత్వం విడుదల చేయవచ్చు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ దీనికి ముందు 15వ విడత డబ్బు నవంబర్ 15, 2023న జమ అయ్యాయి. ప్రస్తుతం ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సాయాన్ని మూడు విడతలుగా రూ.2000 చొప్పున నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి బదిలీ అవుతున్నాయి. టాక్స్ ఫైలింగ్ చేసే వ్యక్తులు మాత్రం దీనిని పొందేందుకు అర్హులు కారు.
ఎలక్షన్స్ దగ్గరపడుతున్న వేళ మధ్యంతర బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం భారీ ప్రకటనలు చేస్తుందని భావిస్తున్నారు. అయితే ఇటీవల దీనిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక ప్రకటనలో ఫిబ్రవరి 1 బడ్జెట్ ప్రధానంగా ఓటు ఆన్ అకౌంట్గా పనిచేస్తుందని అన్నారు. లోక్సభ ఎన్నికలకుముందు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ను మధ్యంతర బడ్జెట్ అనిపిలుస్తాము. ఎన్నికల తర్వాత ఏర్పడే ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ను తర్వాత ప్రవేశపెడుతుంది. గతాన్ని పరిశీలిస్తే.. 2019లో ఎన్నికలకు ముందర కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్లో పీఎం-కిసాన్ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐదేళ్లుగా రైతులకు అందిస్తున్న సాయం విషయంలో ఎలాంటి పెంపు లేనందున ప్రస్తుతం రైతన్నలు ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications