PAN Card News: దేశంలో పౌరులు వినియోగించే ముఖ్యమైన పత్రాల్లో పాన్ కార్డుకు ప్రత్యేక స్థానం ఉంటుంది. దేశం వేగంగా డిజిటలైజేషన్ అవుతున్న నేపథ్యంలో ప్రజలు చేసే హై వాల్యూమ్ చెల్లింపులు, పన్ను ఎగవేతలు అరికట్టడం, ప్రజల ఖర్చులను ట్రాక్ చేయటంతో పాటు వివిధ ఆర్థిక పరమైన పనులు పూర్తి చేసేందుకు పాన్ కార్డును భారత ప్రభుత్వం తప్పనిసరిగా మార్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయాల్లో అనేక మార్పులను తీసుకొచ్చేందుకు మోదీ సర్కార్ సిద్ధమైంది.
ఈ క్రమంలోనే సోమవారం కేంద్ర కేబినెట్ పాన్ కార్డుల వ్యవహారంలో కీలక నిర్ణయాలు తీసుకోబడ్డాయి. పన్ను చెల్లింపుదారుల డిజిటల్ అనుభవాన్ని పెంపొందించేందుకు పాన్ 2.0 ప్రాజెక్ట్కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ నవంబర్ 25న క్యాబినెట్ మీట్ బ్రీఫింగ్ సందర్భంగా వెల్లడించారు. ఈ క్రమంలో రూ.1,435 కోట్ల విలువైన కొత్త ప్రాజెక్ట్ ద్వారా పన్ను చెల్లింపుదారుల రిజిస్ట్రేషన్ సేవల సాంకేతిక పరివర్తనను అనుమతిస్తుందన్నారు. దీని ద్వారా మౌలిక సదుపాయాల భద్రత, ఆప్టిమైజేషన్ చేయాలని కేంద్రం నిర్ణయించింది.

అయితే PAN 2.0 కింద ఇకపై పన్ను చెల్లింపుదారులకు QR కోడ్తో కూడిన కొత్త కార్డ్ జారీ చేయబడుతుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పాత కార్డులు ఉన్న వ్యక్తులకు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండానే ఉచితంగా అప్గ్రేడెడ్ కార్డులను అందించనున్నట్లు పేర్కొన్నారు. కొత్త ప్రాజెక్ట్ పన్ను చెల్లింపుదారుల మెరుగైన డిజిటల్ అనుభవం కోసం PAN/TAN సేవల సాంకేతిక పరివర్తన ద్వారా పన్ను చెల్లింపుదారుల రిజిస్ట్రేషన్ సేవల వ్యాపార ప్రక్రియలను రీ-ఇంజనీరింగ్ చేయడానికి "ఇ-గవర్నెన్స్ ప్రాజెక్ట్" అని వెల్లడించారు.
పాన్ 2.0 ప్రాజెక్ట్ అంటే ఏమిటి?
ప్రభుత్వ PAN 2.0 నిర్ణయం ప్రభుత్వ సంస్థల అన్ని డిజిటల్ ప్లాట్ఫారమ్లలో ఒక కామన్ గుర్తింపుదారుగా పాన్ నంబరును ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. పన్ను శాఖ 10 అక్షరాలతో కూడిన ఆల్ఫాన్యూమరిక్ ఐడెంటిఫైయర్ కార్డును వేగవంతమైన సేవలను అందించటానికి వినియోగిస్తోంది. ఇది ప్రజలకు ఇబ్బందులను, ఖర్చులను తగ్గిస్తుంది. ఈ ఈ-గవర్నెన్స్ చొరవ పాన్సేవల పరివర్తన ద్వారా డిజిటల్ అనుభవాన్ని మెరుగుపరచి పన్ను చెల్లింపుదారుల రిజిస్ట్రేషన్ సేవలను ఆధునీకరించడం లక్ష్యంగా తీసుకురాబడుతోంది. దీని రాకతో ఇప్పటికే ఉన్న PAN/TAN 1.0 సిస్టమ్ నుంచి సేవలు అప్గ్రేడ్ చేయబడనున్నాయి. ప్రస్తుతం దాదాపు 78 కోట్ల పాన్ కార్డులను పంపిణీ చేసింది. వీటిలో 98 శాతం మంది వ్యక్తులకు అందించబడ్డాయి.


Click it and Unblock the Notifications