G20 summit: మొదటిరోజే ఏకతాటిపైకి G20 దేశాలు.. ఇది కదా భారత్ ప్రెసిడెన్సీ పవర్!

G20 summit: దేశ రాజధాని ఢిల్లీలో G20 గ్లోబల్ సమ్మిట్ అంగరంగ వైభవంగా జరుగుతోంది. పలు దేశాలకు చెందిన అగ్రనేతలు దీనికి హాజరయ్యారు. కాగా మొదటిరోజునే ఆయా దేశాధినేతల మధ్య ఓ విషయంపై ఏకాభిప్రాయం వచ్చింది. ఈ మేరకు ప్రధాని మోదీ ఓ ప్రకటన చేశారు.

కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు కట్టుబడి ఉన్న భారత్.. G20 వేదికగా ఓ వినూత్న ప్రయోగానికి తెరతీసింది. సంప్రదాయ పెట్రోల్, డీజిల్‌ తో పాటు జీవ ఇంధనాలను కలిపి వినియోగించాలని పిలుపునిచ్చింది. ఇందుకు సంబంధించి గ్లోబల్ బయో ఫ్యూయల్ అలయన్స్‌ ప్రారంభించినట్లు ప్రధాని తెలిపారు.

G20 summit

తమ జీరో ఉద్గారాల టార్గెట్‌లో భాగంగా స్థిరమైన జీవ ఇంధనాల ప్రాముఖ్యతను గుర్తించినట్లు న్యూదిల్లీ లీడర్స్ డిక్లరేషన్‌ లో G20 దేశాలు తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా 20 శాతం ఇథనాల్‌ ను పెట్రోల్‌ తో కలిపి వినియోగించేందుకు చొరవ తీసుకోవాలని సభ్య దేశాలను భారత్ కోరింది. అయితే పలు దేశాలు దీనిపై ఆసక్తి కనబర్చినా, ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఇండియా ఎనర్జీ వీక్‌ 2023లో భాగంగా గ్లోబల్ బయో ఫ్యూయల్ అలయన్స్‌ను కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి ఫిబ్రవరిలో తొలిసారిగా ప్రకటించారు. జీవ ఇంధన మార్కెట్లను బలోపేతం చేయడం, ట్రేడ్ ను సులభతరం చేయడం, జాతీయ బయో ఫ్యూయల్ కార్యక్రమాలకు సాంకేతిక మద్ధతు అందించడంపై దృష్టి పెట్టిన్నట్లు తెలిపారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+