PM Awas Yojana: రోజురోజుకూ జీవితం ఖరీదైనదిగా మారిపోతోంది. ఉన్నవారికి లేని వారికి మధ్య అంతరాయం పెరిగిపోతోంది. దీనిపై ప్రధాని మోదీ ముఖ్యంగా దృష్టి సారించారు. అందుకే మధ్యతరగతి ప్రజల కోసం నేనున్నానంటూ కీలక ప్రకటన చేశారు.
మధ్యతరగతి ప్రజల కోసం ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పెద్ద ప్రకటన చేశారు. నగరాల్లో నివశించే సామాన్యులకు ఉండే సొంతింటి కలను నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం 2015 సంవత్సరంలోనే ప్రధాన మంత్రి ఆవాస్ యోజనను కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే కొత్త పథకం కింద నగరాల్లో సొంతంగా ప్రైవేట్ ఇళ్లు లేని కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రధాని వాగ్ధానం చేశారు.

ఇందులో భాగంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(అర్బన్) కింద కూడా కోటికి పైగా ఇళ్లను ప్రభుత్వం ఆమోదించింది. జూలై 31, 2023 వరకు ఈ పథకం కింద సుమారు 1.18 కోట్ల గృహాలు ఆమోదించబడ్డాయి. అదే సమయంలో 76 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేశారు. చాలా మందికి ఉండే సొంతింటి కలను బీజేపీ ప్రభుత్వం తప్పక నెరవేరుస్తుందని దేశ ప్రజలకు ప్రధాని మోదీ నమ్మకం కలిగించారు. తమ ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుందని తన ప్రసంగం ద్వారా మోదీ హామీ ఇచ్చారు.
ఇదే సమయంలో మోదీ మధ్యతరగతిని పీడిస్తున్న మరో సమస్య ద్రవ్యోల్బణంపై కూడా ప్రసంగంలో ప్రస్థావించారు. తమ ప్రభుత్వం దేశప్రజలకు ద్రవ్యోల్బణం భారాన్ని తగ్గించడానికి కృషి చేస్తోందని.. ఈ ప్రయాణంలో కొంత విజయం సాధించిందని తెలిపారు. ప్రస్తుతం ఈ విషయంలో భారత్ ప్రపంచంలోని చాలా దేశాలతో పోల్చితే మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ.. ద్రవ్యోల్బణ కట్టడికి తన ప్రయత్నాలు మాత్రం నిరంతరం కొనసాగుతాయని చెప్పారు.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications