Mobile Recharge Hike Coming Soon: మొబైల్ వినియోగదారులకు అలర్ట్..ఇకపై మీరు మొబైల్లో మాట్లాడటం లేదా ఇంటర్నెట్ ఉపయోగించడం మరింత ఖరీదైనదిగా మారనుంది.భారతదేశ టెలికాం రంగంలోని కంపెనీలు మరోసారి ధరల పెరుగుదలకి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. తాజా నివేదికల ప్రకారం ప్రముఖ ప్రైవేట్ టెలికాం సంస్థలు రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్-ఐడియా కంపెనీలు రీచార్జ్ ధరలను పెంచే యోచనలో ఉన్నాయి. ఈ పెంపు 2025 నవంబర్-డిసెంబర్ మధ్య కాలంలో అమలులోకి రావచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇది ముఖ్యంగా మీడియం లేదా ప్రీమియం ప్లాన్లు ఉపయోగించే వినియోగదారులపై తీవ్ర ప్రభావం అయితే చూపనుంది.
గత జూలై నెలలో టెలికం కంపెనీలు తమ రీచార్జ్ ప్లాన్ల ధరలను పెంచిన సంగతి విదితమే. దీంతో చాలామంది వినియోగదారులు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన BSNL వైపు మొగ్గుచూపారు. అయితే, BSNL నెట్వర్క్ అన్ని ఏరియాల్లో లభ్యత అంతగా లేకపోవడంతో వారికి అది ఉపయోగపడటం లేదు. ఈ నెలలో ప్లాన్ల ధరలు 11 శాతం నుండి 23శాతం వరకు పెరిగాయి. దీని ప్రభావంతో కొంతమంది వినియోగదారులు తమ సేవలను నిలిపివేశారు. దీంతో జూలై-నవంబర్ 2024 మధ్యకాలంలో దాదాపు 2.1 కోట్ల మంది వినియోగదారులు తగ్గిపోయారు. అయితే ప్రస్తుతం పరిస్థితి కొంచెం కుదటపడుతోంది.

అయితే ధరలు పెంచినా కొత్త వినియోగదారుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. మే 2025 నెలలో యాక్టివ్ వినియోగదారుల సంఖ్యలో గత 29 నెలలలో అత్యధిక వృద్ధి నమోదైంది. ఈ నెలలో మొత్తం 74 లక్షల మంది కొత్త యాక్టివ్ యూజర్లు టెలికంలోకి ప్రవేశించారు. దీంతో భారతదేశంలో మొబైల్ యాక్టివ్ యూజర్ల మొత్తం సంఖ్య సుమారు 108 కోట్లకు చేరుకుది. రిలయన్స్ జియోకు ఒక్క మే నెలలోనే 55 లక్షల మంది యూజర్లు జత అయ్యారు. ప్రస్తుతం జియోకి 53 శాతం యాక్టివ్ యూజర్ బేస్ ఉంది.ఇక భారతి ఎయిర్టెల్ కూడా 13 లక్షల మంది యూజర్లను కొత్తగా యాడ్ చేసుకుంది. దీనికి ప్రస్తుతం 36% యాక్టివ్ యూజర్ బేస్ ఉంది.
ధరల పెంపు కారణం : ఈ ధరల పెంపు వెనుక ప్రధాన కారణంగా కంపెనీలు ఏం చెబుతున్నాయంటే 5G సేవలతో పాటుగా, స్పెక్ట్రమ్ కొనుగోలు ఖర్చులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం అవసరమైన భారీ పెట్టుబడులను సాకుగా చూపుతున్నాయి. ఈ ఖర్చులను భరించేందుకు రీచార్జ్ ధరలు పెంచాల్సిన అవసరం తప్పడం లేదని టెలికం కంపెనీలు చెబుతున్నాయి. ప్రస్తుతం సగటు మొబైల్ వినియోగదారుడు నెలకు సుమారు రూ.200 వరకు ఖర్చు చేస్తున్నాడు. ధరలు పెరిగితే ఇది రూ.349కు చేరుకునే అవకాశముంది. అంటే దాదాపు 20 శాతం నుండి 25 శాతం వరకు పెరుగుదల వుండొచ్చు.
మీరు డబ్బు ఎలా సేవ్ చేసుకోవాలంటే: ఈ ధరల పెరుగుదల మిమ్మల్ని ప్రభావితం చేయకుండా ఉండాలంటే మీరు కొన్ని పనులు చేయడం ద్వారా అలర్ట్ అవ్వొచ్చు. ప్రభుత్వ రంగ సంస్థ BSNL ఇప్పటివరకు ధరలను పెంచలేదు. కాబట్టి మీ ఏరియాలో దీని నెట్వర్క్ బలంగా ఉంటే వెంటనే పోర్ట్ ద్వారా మారిపోవడం ఉత్తమం. దీని వల్ల డబ్బు ఆదా అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ధరల పెంపు అమలులోకి రాకముందే మీరు 365 రోజుల ప్లాన్తో రీచార్జ్ చేసుకోండి. ఇది మీ డబ్బును ధరలు పెరిగిన తర్వాత ఆదా చేయవచ్చు. మీ మొబైల్ అవసరాలకు తగిన ప్లాన్ను ఎంచుకొని ముందుగానే రీచార్జ్ చేయడం వలన రాబోయే పెరుగుదలను నియంత్రించుకోవచ్చు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications