Mobile Recharge Hike Coming Soon: మొబైల్ వినియోగదారులకు అలర్ట్..ఇకపై మీరు మొబైల్లో మాట్లాడటం లేదా ఇంటర్నెట్ ఉపయోగించడం మరింత ఖరీదైనదిగా మారనుంది.భారతదేశ టెలికాం రంగంలోని కంపెనీలు మరోసారి ధరల పెరుగుదలకి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. తాజా నివేదికల ప్రకారం ప్రముఖ ప్రైవేట్ టెలికాం సంస్థలు రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్-ఐడియా కంపెనీలు రీచార్జ్ ధరలను పెంచే యోచనలో ఉన్నాయి. ఈ పెంపు 2025 నవంబర్-డిసెంబర్ మధ్య కాలంలో అమలులోకి రావచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇది ముఖ్యంగా మీడియం లేదా ప్రీమియం ప్లాన్లు ఉపయోగించే వినియోగదారులపై తీవ్ర ప్రభావం అయితే చూపనుంది.
గత జూలై నెలలో టెలికం కంపెనీలు తమ రీచార్జ్ ప్లాన్ల ధరలను పెంచిన సంగతి విదితమే. దీంతో చాలామంది వినియోగదారులు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన BSNL వైపు మొగ్గుచూపారు. అయితే, BSNL నెట్వర్క్ అన్ని ఏరియాల్లో లభ్యత అంతగా లేకపోవడంతో వారికి అది ఉపయోగపడటం లేదు. ఈ నెలలో ప్లాన్ల ధరలు 11 శాతం నుండి 23శాతం వరకు పెరిగాయి. దీని ప్రభావంతో కొంతమంది వినియోగదారులు తమ సేవలను నిలిపివేశారు. దీంతో జూలై-నవంబర్ 2024 మధ్యకాలంలో దాదాపు 2.1 కోట్ల మంది వినియోగదారులు తగ్గిపోయారు. అయితే ప్రస్తుతం పరిస్థితి కొంచెం కుదటపడుతోంది.

అయితే ధరలు పెంచినా కొత్త వినియోగదారుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. మే 2025 నెలలో యాక్టివ్ వినియోగదారుల సంఖ్యలో గత 29 నెలలలో అత్యధిక వృద్ధి నమోదైంది. ఈ నెలలో మొత్తం 74 లక్షల మంది కొత్త యాక్టివ్ యూజర్లు టెలికంలోకి ప్రవేశించారు. దీంతో భారతదేశంలో మొబైల్ యాక్టివ్ యూజర్ల మొత్తం సంఖ్య సుమారు 108 కోట్లకు చేరుకుది. రిలయన్స్ జియోకు ఒక్క మే నెలలోనే 55 లక్షల మంది యూజర్లు జత అయ్యారు. ప్రస్తుతం జియోకి 53 శాతం యాక్టివ్ యూజర్ బేస్ ఉంది.ఇక భారతి ఎయిర్టెల్ కూడా 13 లక్షల మంది యూజర్లను కొత్తగా యాడ్ చేసుకుంది. దీనికి ప్రస్తుతం 36% యాక్టివ్ యూజర్ బేస్ ఉంది.
ధరల పెంపు కారణం : ఈ ధరల పెంపు వెనుక ప్రధాన కారణంగా కంపెనీలు ఏం చెబుతున్నాయంటే 5G సేవలతో పాటుగా, స్పెక్ట్రమ్ కొనుగోలు ఖర్చులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం అవసరమైన భారీ పెట్టుబడులను సాకుగా చూపుతున్నాయి. ఈ ఖర్చులను భరించేందుకు రీచార్జ్ ధరలు పెంచాల్సిన అవసరం తప్పడం లేదని టెలికం కంపెనీలు చెబుతున్నాయి. ప్రస్తుతం సగటు మొబైల్ వినియోగదారుడు నెలకు సుమారు రూ.200 వరకు ఖర్చు చేస్తున్నాడు. ధరలు పెరిగితే ఇది రూ.349కు చేరుకునే అవకాశముంది. అంటే దాదాపు 20 శాతం నుండి 25 శాతం వరకు పెరుగుదల వుండొచ్చు.
మీరు డబ్బు ఎలా సేవ్ చేసుకోవాలంటే: ఈ ధరల పెరుగుదల మిమ్మల్ని ప్రభావితం చేయకుండా ఉండాలంటే మీరు కొన్ని పనులు చేయడం ద్వారా అలర్ట్ అవ్వొచ్చు. ప్రభుత్వ రంగ సంస్థ BSNL ఇప్పటివరకు ధరలను పెంచలేదు. కాబట్టి మీ ఏరియాలో దీని నెట్వర్క్ బలంగా ఉంటే వెంటనే పోర్ట్ ద్వారా మారిపోవడం ఉత్తమం. దీని వల్ల డబ్బు ఆదా అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ధరల పెంపు అమలులోకి రాకముందే మీరు 365 రోజుల ప్లాన్తో రీచార్జ్ చేసుకోండి. ఇది మీ డబ్బును ధరలు పెరిగిన తర్వాత ఆదా చేయవచ్చు. మీ మొబైల్ అవసరాలకు తగిన ప్లాన్ను ఎంచుకొని ముందుగానే రీచార్జ్ చేయడం వలన రాబోయే పెరుగుదలను నియంత్రించుకోవచ్చు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications