మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్..భారీగా తగ్గనున్న రీఛార్జ్ ప్లాన్ల ధరలు.. కేంద్ర ప్రభుత్వం మెగా ప్లాన్ ఇదిగో..

Mobile Recharge Cheaper: దేశవ్యాప్తంగా పెరిగిన మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించనుంది. మొబైల్ సేవలపై వినియోగదారుల జేబులపై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదిత నిబంధనలు అమలులోకి వస్తే రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా (Vi) వంటి ప్రధాన టెలికాం కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను గణనీయంగా తగ్గించే అవకాశం ఉంది.

ఈ ప్రణాళిక ప్రకారం.. టెలికాం రంగానికి ఊరటనిస్తూ ప్రభుత్వం వాటిపై విధించే వివిధ పన్నులు, లైసెన్స్ ఫీజులు, స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీలను తగ్గించాలని తీవ్రంగా యోచిస్తోంది. ప్రస్తుతం భారతదేశంలో టెలికాం కంపెనీలు తమ మొత్తం ఆదాయంలో సుమారు 8 శాతాన్ని లైసెన్స్ ఫీజులు, స్పెక్ట్రమ్ ఛార్జీల రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తున్నాయి. టెలికాం మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్ రూపొందించిన ప్రతిపాదనల ప్రకారం.. ఈ 8 శాతం రుసుమును ఏకంగా 3 నుండి 4 శాతానికి తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

mobile recharge mobile recharge plans mobile recharge price cheaper recharge plans Jio recharge Airtel recharge Vi recharge Jio Airtel Vi plans TRAI new rules TRAI proposal voice and SMS only plans voice SMS recharge data-free recharge plan affordable mobile plans mobile users recharge cost cheap mobile recharge

ఈ 8 శాతం ఫీజులో ప్రతి ఏటా 5 శాతాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ మౌలిక వసతుల కల్పన కోసం కేటాయించే ప్రభుత్వ నిధికి జమ చేస్తుంటారు. అయితే ఈ నిధిలో ఇప్పటికే సరిపడా నిధులు జమ కావడంతో.. రాబోయే కొద్ది సంవత్సరాల పాటు కంపెనీల నుండి వసూలు చేసే ఈ 5 శాతం రుసుమును పూర్తిగా మినహాయించడం లేదా గణనీయంగా తగ్గించడంపై ప్రభుత్వం సుముఖంగా ఉంది. ఫీజుల కోత ద్వారా టెలికాం కంపెనీలకు బిలియన్ల కొద్దీ నిధులు ఆదా అవుతాయి. దీని ఫలితంగా ఆ ప్రయోజనాన్ని నేరుగా చౌకైన ప్లాన్ల రూపంలో నిరుపేద, గ్రామీణ పౌరులకు అందించవచ్చని భావిస్తున్నారు.

Also Read

గత జూలై నెలలో టెలికాం దిగ్గజాలు తమ ప్రీపెయిడ్ ప్లాన్ ధరలను ఏకంగా 15 నుండి 25 శాతం వరకు పెంచడంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సాధారణంగా ఉపయోగించే 28 రోజులు, 56 రోజులు, 84 రోజుల ప్లాన్లు భారంగా మారడంతో అనేకమంది సామాన్యులు తమ సెకండరీ సిమ్ కార్డులను డీయాక్టివేట్ చేసుకోవడం లేదా రీఛార్జ్ చేసుకోవడం తగ్గిస్తున్నారు. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం.. టెలికాం నియంత్రణ సంస్థ (TRAI) మరియు నిపుణుల సలహాతో ఈ పన్ను సడలింపు మార్గాన్ని ఎంచుకుంది.

ప్రభుత్వ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే టెలికాం కంపెనీలు తమ ప్లాన్ల ధరలను 10 నుండి 15 శాతం వరకు తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ తగ్గింపుల వల్ల ప్రస్తుతం రూ.299 గా ఉన్న నెలవారీ ప్లాన్ ధర రూ.250 నుండి రూ.260 స్థాయికి తగ్గే అవకాశం ఉంది. అదే విధంగా దీర్ఘకాలిక వార్షిక ప్లాన్లపై కనీసం రూ.300 నుండి రూ.400 వరకు వినియోగదారులకు పొదుపు లభించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+