Micromax Solar: ఇటీవలి కాలంలో భారతదేశంలోని అనేక కంపెనీలు గ్రీన్ ఎనర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీ రంగాల్లో కొత్త పెట్టుబడులు పెడుతున్నాయి. భవిష్యత్తులో ఈ రంగాల్లోని కంపెనీలకు మంచి భవిష్యత్తు ఉండటంతో డిమాండ్ కి అనుగుణంగా తమ వ్యాపారాలను రీషేప్ చేస్తూ ముందుకు సాగుతున్నాయి.
ఈ క్రమంలోనే దేశంలోని ప్రముఖ కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ మైక్రోమాక్స్ ఇన్ఫర్మాటిక్స్ బుధవారం నాడు రెన్యూవబుల్ ఎనర్జీ వ్యాపారంలోకి ప్రవేశించినట్లు ప్రకటించింది. వాస్తవానికి ఈ కంపెనీ గతంలో కీప్యాడ్ మెుబైల్ ఫోన్లను తయారు చేసి విక్రయించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం బేసిక్ మెుబైల్ ఫోన్లకు డిమాండ్ భారీగా పడిపోవటంతో కొత్త వ్యాపార ఆలోచనతో ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ కొత్త వ్యాపార విభాగం 'స్టార్టప్ ఎనర్జీ' పేరుతో సోలార్ ప్యానల్స్ను తయారు చేయడంపై దృష్టి సారిస్తుందని కంపెనీ పేర్కొంది.

స్టార్టప్ ఎనర్జీ ప్రధానంగా రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ కోసం సోలార్ ప్యానల్స్ను తయారు చేయనుంది. మైక్రోమాక్స్ ఇన్ఫర్మాటిక్స్ నిర్వహణ డైరెక్టర్ రాజేష్ అగర్వాల్ మాట్లాడుతూ.. తమ లక్ష్యం గ్రీన్ ఎనర్జీని మరింత అందుబాటులోకి తీసుకురావడం, దానిని నమ్మకంగా, తక్కువ ఖర్చుతో అందించడమేన్నారు. దీని ద్వారా వ్యక్తులు, వ్యాపారాలు సుస్థిర ఎనర్జీ పరిష్కారాలను ఉపయోగించడానికి వీలవుతుందని పేర్కొన్నారు. ఆధునిక సోలార్ ప్యానెల్ తయారీకి పెట్టుబడి పెడుతూ భారత ఎనర్జీ విధానం లక్ష్యాన్ని సమర్థించడంతో పాటు గ్రీన్ ఎనర్జీ పరిష్కారాలను అందించటంలో తాము భాగంగా మారుతున్నట్లు పేర్కొన్నారు.
దీనికోసం గురుగ్రామ్లో ఉన్న మైక్రోమ్యాక్స్ జిన్చెన్తో ఒక వ్యూహాత్మక ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా 5GW అధునిక సోలార్ మాడ్యూల్ తయారీ లైన్ను తీసుకురానుంది. ఈ ప్రాజెక్ట్ను అనేక దశలలో అమలు చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. దేశంలో సోలార్ ఎనర్జీ రంగం గత కొన్ని సంవత్సరాలుగా వేగంగా అభివృద్ధి చెందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వాలు 2030 నాటికి 500 GW రిన్యువబుల్ ఎనర్జీ సామర్థ్యాన్ని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. దీంతో స్థానికంగా తయారయ్యే సోలార్ మాడ్యూల్స్ కోసం డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం దీనిని అందిపుచ్చుకోవటానికి అంబానీ నుంచి అదానీ వరకు పెద్ద వ్యాపార దిగ్గజాలు కూడా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications