BharatPe: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలతో ప్రస్తుతం పేటీఎం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దీంతో ఫిన్ టెక్ కంపెనీల పట్ల నియంత్రణ సంస్థ తీరుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో ఇదే రంగానికి చెందిన మరో కంపెనీకి కేంద్రం షాక్ ఇచ్చింది. అయితే ఇది నిబంధనల ఉల్లంఘనలపై ఆర్బీఐ నుంచి వచ్చింది కాకపోవడం గమనార్హం.
ఫిన్ టెక్ యూనికార్న్ భారత్ పే వ్యవస్థాపకులుగా అష్నీర్ గ్రోవర్ బిజినెస్ ప్రపంచానికి సుపరిచితమే. ఆయనపై సొంత కంపెనీనే చట్టపరమైన చర్యలకు దిగింది. ఇందుకు సంబంధించి మరింత సమాచారాన్ని కోరుతూ కంపెనీల చట్టంలోని సెక్షన్ 206 కింద సంస్థకు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటీసు పంపించింది.

'అదనపు సమాచారం కోసం కంపెనీకి ROC లేఖ రాసింది. 2022లో అంతర్గత సమీక్ష తర్వాత నుంచి కొనసాగుతున్న విచారణలో భాగంగా వివరాలు సమర్పించాలని లేఖలో పేర్కొంది. మా ఆడిట్ ఫలితాలలో సమాచారాన్ని అందించాం. అయితే సాధ్యమైనంత మేర వారికి సహకారం అందించేందుకు ప్రయత్నిస్తున్నాం' అని భారత్ పే ఒక ప్రకటనలో తెలిపింది.
గ్రోవర్పై సివిల్ మరియు క్రిమినల్ కేసుల ఫిర్యాదులకు సంబంధించి కోర్టులకు సమర్పించిన సాక్ష్యాలను కోరుతూ MCA ఈ లేఖ రాసినట్లు సమాచారం. 2022 ప్రారంభంలో నైకా IPO కేటాయింపులో విఫలమైనందుకు కోటక్ గ్రూప్ ఉద్యోగిని అనుచిత పదజాలంతో బెదిరించారని గ్రోవర్పై ఆరోపణలు వచ్చాయి. అనంతరం భారత్పే మేనేజింగ్ డైరెక్టర్గా రాజీనామా చేశారు.
అయితే ఆయన హయాంలోని ఆర్థిక విధానాలపై కంపెనీ ఫోరెన్సిక్ ఆడిట్ను నిర్వహించింది. నకిలీ బిల్లులను ఉపయోగించి సంస్థ నిధులను దుర్వినియోగం చేసినట్లు సివిల్ దావా వేసింది. వాటిని తన వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగించుకున్నారని అందులో పేర్కొంది. వీటికితోడు సందేహాస్పద లావాదేవీలు, నకిలీ విక్రేతల విషయంలోనూ ఆరోపణలు ఎదుర్కొన్నారు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications