Milk Prices: ప్రస్తుతం దేశంలో పాల ద్రవ్యోల్బణం పెద్ద సంక్షోభాన్ని సృష్టిస్తోంది. ఈ క్రమంలో దక్షిణాది రాష్ట్రాల్లో గుజరాత్ సంస్థ అమూల్ పాల విక్రయాలను చేపట్టాలని నిర్ణయించటంతో రాజకీయ దుమారం పెరిగింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు అమూల్, నందిని పాల బ్రాండ్ల మధ్య పెద్ద పోటీకి తెరలేపింది.
తాజాగా విడుదలైన వినియోగదారుల ధరల సూచీ సమాచారంలో పాలు, పాల ఉత్పత్తుల ధరల ద్రవ్యోల్బణం 9.31 శాతంగా ఉంది. 2023 సంవత్సరం మెుదటి త్రైమాసికంలో ఇది 9.25 శాతంగా ఉంది. 2014 అక్టోబర్-డిసెంబర్ తర్వాత పాల ద్రవ్యోల్బణం అత్యధికంగా ఉండటం ఇదే తొలిసారి. సీపీఐ ద్రవ్యోల్బణం బాస్కెట్లో పాలు, పాల ఉత్పత్తులకు 6.62 శాతం వాటా కలిగి ఉంది.

ప్రధానంగా పశువుల దాణా ఖర్చులు విపరీతంగా పెరగటంతో పాల ధరలు పెరుగుతున్నాయి. దేశంలోని చాలా డెయిరీలు గత కొన్ని నెలలుగా పాల ధరలను క్రమంగా పెంచుతున్నాయి. పశుగ్రాసం ద్రవ్యోల్బణం రెండకెలను తాకటంతో చాలా మంది రైతులు పాత ఉత్పత్తికి దూరంగా జరుగుతున్నారు.
2020 ప్రారంభంలో కరోనా సమయంలో డెయిరీ ఉత్పత్తులకు దేశంలో డిమాండ్ భారీగా తగ్గింది. ఆ సమయంలో రైతులు ఖర్చులను తగ్గించుకునేందుకు తమ వద్ద ఉండే పశువుల సంఖ్యను తగ్గించుకున్నారు. అలాగే పాలు ఇవ్వని దూడలు, గర్భిణీ పశువులకు తక్కువ మేత కూడా ఇవ్వడం ప్రారంభించారు. అలా అవి షోషకాహారానికి దూరమయ్యాయి. ఆ ప్రభువం ఇప్పుడు తక్కువ పాల ఉత్పత్తికి పరోక్షంగా కారణమైందని నిపుణులు చెబుతున్నారు.

ఈ క్రమంలో దేశంలోని చాలా డెయిరీలు తక్కువ పాల సేకరణను చూస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాలా సంస్థలు ఇతర దేశాలకు తమ పాల ఉత్పత్తులను సరఫరా చేసి మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నాయి. దీనికి తోడు పశువులకు సోకిన వ్యాధులు పాల ఉత్పత్తిని తగ్గించాయి. దేశీయ డిమాండ్ కు అనుగుణంగా అందించేందుకు పాలను దిగమతి చేసుకోవాలని కేంద్రం యోచిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా ఉన్న భారత్ ఇప్పుడు పాలను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితులను ఎదుర్కొంటోంది.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications