అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయంతో H-1B , H-4 వీసాలకు సంవత్సరానికి లక్ష డాలర్లు రుసుము విధించబడింది. ఈ కారణంగా అమెరికాలో పనిచేయే భారతీయ, ఇతర విదేశీ నిపుణులు పెద్ద ఆర్థిక భారాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రాయిటర్స్ సమీక్షించిన అంతర్గత ఇమెయిల్ ప్రకారం మైక్రోసాఫ్ట్ ఇప్పటికే అమెరికాలో ఉన్న H-1B, H-4 వీసాదారులకు సెప్టెంబర్ 21 గడువుకు ముందే తిరిగి అమెరికాకు రావాలని సూచించింది. కంపెనీ సూచన ప్రకారం.. ప్రస్తుతం అమెరికాలో ఉన్న H-1B ఉద్యోగులు భవిష్యత్తులో కూడా అక్కడే స్థిరపడుతూ పనిచేయాలని మైక్రోసాఫ్ట్ సూచించింది.
అమెరికన్లు తమ విదేశీ కార్యాలయాల ద్వారా పని చేయకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ఇది ప్రపంచంలో రెండో అతిపెద్ద టెక్ దిగ్గజం అయిన మైక్రోసాఫ్ట్ కూడా ఈ కొత్త H-1B విధానంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నదని చూపుతుంది. మైక్రోసాఫ్ట్తో పాటు జేపీ మోర్గాన్ కూడా విదేశాల్లో పనిచేస్తున్న H-1B వీసాదారులను గడవుకు ముందే అమెరికాకు తిరిగి రావాలని సూచించింది.

ప్రస్తుతం, అమెజాన్, ఆపిల్, గూగుల్, మెటా వంటి పెద్ద టెక్ కంపెనీలకు కూడా విదేశాల్లో వేలాది H-1B ఉద్యోగులు ఉన్నారు. ఈ నిర్ణయం అమలులోకి వస్తే, వీరందరిని కూడా అమెరికాకు తిరిగి రాక తప్పనిసరి కావచ్చు. మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా వంటి టెక్ దిగ్గజాలు ఇప్పటికే వేలాది H-1B వీసాలు పొందాయి. 2025 ప్రథమార్థంలో అమెజాన్ AWS 12,000 కంటే ఎక్కువ H-1B వీసాలకు ఆమోదం పొందగా, మైక్రోసాఫ్ట్, మెటా ఒక్కొక్కటి 5 వేల కంటే ఎక్కువ ఆమోదాలను పొందాయి.
H-1B వీసా అనేది అమెరికాలోని కంపెనీలు ప్రత్యేక నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులను తాత్కాలికంగా నియమించుకోవడానికి రూపొందించిన వీసా. దీన్ని మొదట 1990లో ప్రారంభించారు. ఈ వీసాలు సాధారణంగా మూడు నుంచి ఆరు సంవత్సరాల వరకు మంజూరు అవుతాయి. భారతీయులు H-1B వీసాదారుల్లో 71% వాటా కలిగి ఉన్నారు.
కొత్త రుసుము ప్రభావం ప్రధానంగా భారతీయ ఉద్యోగులపై పడనుంది. కాగా టెక్ పరిశ్రమలోని దిగ్గజాలు ఈ నిర్ణయంపై ఇంకా పూర్తి స్పందన ఇవ్వలేదని రిపోర్ట్లు సూచిస్తున్నాయి. అయితే, మైక్రోసాఫ్ట్, జేపీ మోర్గాన్ వంటి కంపెనీలు ఇప్పటికే తక్షణ చర్యలు సూచించడంతో.. భారతీయ IT నిపుణులు, ఇతర H-1B వీసా హోల్డర్లు ఇప్పుడు తమ భవిష్యత్తును భద్రపరచుకోవడానికి తక్షణ చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రపంచంలో ప్రముఖ బ్యాకింగ్ దిగ్గజం JP మోర్గాన్ కంపెనీ కూడా తన H-1B వీసా ఉద్యోగులకు తక్షణ చర్యలను సూచించింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం JP మోర్గాన్ ఇమ్మిగ్రేషన్ న్యాయవాది ఒక అంతర్గత ఇమెయిల్ ద్వారా ఉద్యోగులకు సెప్టెంబర్ 21, ఉదయం 12:01am ET లోపు వెంటనే US కి తిరిగి రావాలని హెచ్చరిక జారీ చేశారు. ఈ ఇమెయిల్లో H-1B వీసా హోల్డర్లకు ముందస్తు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Microsoft, JpMorgan కంపెనీలు ప్రస్తుతం అమెరికాలో ఉన్న H-1B ఉద్యోగులు తదుపరి మార్గదర్శకత్వం వచ్చే వరకు అంతర్జాతీయ ప్రయాణాలను నివారించాలని సూచన ఇచ్చారు. ఈ చర్య ట్రంప్ పరిపాలన కొత్త ఇమ్మిగ్రేషన్ ఆర్డర్ను అమలు చేయడానికి కంపెనీలు, ఉద్యోగులు సిద్ధమవుతున్న సందర్భంలో తీసుకోవడం జరిగింది.
More From GoodReturns

హైదరాబాద్లో పాడ్ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయ్.. మెట్రో స్టేషన్ నుంచి నేరుగా ఆఫీసుకే వెళ్లిపోవచ్చు ఇక..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

Bengaluru: టీసీఎస్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! మీ స్నేహితుడిని చేర్పించండి.. రూ. 40,000 గెలుచుకోండి!

హైదరాబాద్, పుణే వద్దు బెంగళూరు ముద్దు.. అధిక అద్దెలున్నా బెంగళూరును వదలమంటున్న టెక్ కంపెనీలు..

బంగారం ధరలు తగ్గాయి ..ఎంత తగ్గాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. ఫిబ్రవరి 26, గురువారం పసిడి ధరలు ఇవే..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

Bengaluru: దక్షిణాది నుంచి ఉత్తరాదికి జెట్ స్పీడ్.. కొత్త రైల్వే లైన్లకు గ్రీన్ సిగ్నల్!

Gold: బంగారం ధరలు తగ్గేది అందుకు కాదు! అసలు విషయం బయటపెట్టిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీఈఓ!

వెండి ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. వచ్చే నెలలో రూ. 3 లక్షలకు.. కొనేందుకు ఎగబడుతున్న పెట్టుబడిదారులు

Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు చెక్: ఒక్క ప్రాజెక్టుతో 40 వేల బస్సులు మాయం!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications