AP News: ఏపీ యువతకు శిక్షణ ఇచ్చేందుకు ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం.. పూర్తి వివరాలు

AP Skill Development: గత వైకాపా సర్కార్ అధికారంలో ఉన్న సమయంలో స్కిల్ స్కామ్ జరిగిదని భారీగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుపై అభియోగాలు మోపింది. దీంతో ఆయన దాదాపు రెండు రోజుల వరకు జైలు జీవితాన్ని గడపాల్సి వచ్చింది. అయితే దీనికి నిరూపించే బలమైన సాక్ష్యాలు ఏమీ దొరకలేదు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి ఆరోపణలకు తిరిగి తావులేకుండా యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది.

సర్కార్ ప్రస్తుతం ఏపీలో స్కిల్ సెన్సెస్ నిర్వహించాలని నిర్ణయించింది. మంత్రి లోకేష్ దీనిపై అధికంగా ఫోకస్ కొనసాగిస్తున్నారు. ఇది రాష్ట్రాన్ని వేగంగా డెవలప్ చేసేందుకు దోహదపడుతుందని తెలుస్తోంది. ఈ క్రమంలో స్కిల్ డెవలప్మెంట్ కోసం ఈసారి జాతీయ అంతర్జీతీయ టెక్ సంస్థలను భాగస్వాములుగా చేర్చుకోవాలని నిర్ణయించింది. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్, ఐబీఎం, ఇన్ఫోసిస్ ఏపీ యువత భవితవ్యాన్ని తీర్చిదిద్దటంలో తమ వంతు సహకారాన్ని అందిస్తాయని తెలుస్తోంది. ఈ క్రమంలో సర్టిఫికెట్లను స్కిల్ సర్వేతో లింక్ చేయనున్నట్లు సమాచారం.

Microsoft IBM Infosys partnering with AP Gov in Skill Development Know details

ఈక్రమంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‍స్ట్రక్షన్ తన స్కిల్ సెంటర్ ఏపీ రాజధాని నగరం అమరావతిలో ఏర్పాటు చేస్తుందని, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇందుకోసం ముందుగా టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రైమరీ టాబ్యులేషన్ నిర్వహిస్తుందని, మైక్రోసాఫ్ట్ ఐబీఎం స్కిల్ ఎడ్యుకేషన్ అందించటంలో భాగమౌతాయని తెలుస్తోంది. అలాగే సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు నిర్మాణ రంగంలో అవసరమైన నైపుణ్యాలను అందించటం వారికి ట్రైనింగ్ ఇవ్వటానికి ఎల్ అండ్ టి ముందుకొచ్చినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు, నిర్వహణకు సంబంధించి రూపకల్పన జరుగుతోందని తెలుస్తోంది.

గతంలో స్కిల్ స్కామ్ వివరాలు..
ఏపీ సీఐడీ నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ స్కాం కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు 50 రోజులకు పైగా జైలు జీవితాన్ని గడిపారు. రూ.371 కోట్ల మేర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్కామ్‌లో అవినీతి జరిగిందని అప్పటి ఏపీ సీఐడీ అధికారులు దర్యాప్తులో ఆరోపించారు. అయితే చివరికి అక్టోబర్ 31, 2023న జైలు నుంచి బెయిల్‌పై చంద్రబాబు రిలీజ్ అయ్యారు. చార్జిషీట్‌లో చెప్పిన డిజైన్‌టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇతరులకు చెందిన రూ.23.5 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా అటాచ్ చేయడానికి ఈడీ హైదరాబాద్ యూనిట్ మనీలాండరింగ్ నిరోధక చట్టాన్ని అమలు చేసింది. సీమెన్స్ ప్రాజెక్టులో ఏపీ ప్రభుత్వం పెట్టిన డబ్బు కొన్ని షెల్ కంపెనీల ద్వారా దారి మళ్లించబడిందని అప్పట్లో దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+