ఇంతకాలం పాకిస్తాన్లో టెక్నాలజీకి ఊపు తీసుకొచ్చిన మైక్రోసాఫ్ట్, ఇప్పుడు అక్కడ తన దుకాణం మూసేసింది. 25 ఏళ్లుగా అక్కడ పనిచేసిన ఈ టెక్ దిగ్గజం, ఒక్కసారిగా "బై బై" చెప్పేసింది. ఇది అక్కడి టెక్ రంగంకి ఆశ్చర్యం కలిగించే విషయమే. మైక్రోసాఫ్ట్ లేకుండా పాకిస్తాన్ టెక్ ప్రపంచం ఎలా ఉండబోతుందో చూడాలి!

మైక్రోసాఫ్ట్ సంస్థ పాకిస్తాన్లో గత 25 ఏళ్లుగా కార్యకలాపాలు సాగించింది. 2000లో మొదలైన ప్రయాణం 2025లో ఆగిపోయింది. ఇటీవల మైక్రోసాఫ్ట్ తమ పాకిస్తాన్ రీజినల్ ఆఫీస్ని పూర్తిగా మూసివేసింది. మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్లో ప్రభుత్వ శాఖలతో కలిసి ఈ-గవర్నెన్స్ ప్రాజెక్టులు, విద్యా రంగంలో డిజిటల్ లిటరసీ కార్యక్రమాలు, ఎంటర్ప్రైజ్ సొల్యూషన్లు అమలు చేసింది. దేశంలో ఆధునిక ఐటీ ప్రమాణాలను పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించింది.
ఇటీవల పాకిస్తాన్ ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. విదేశీ పెట్టుబడులకు అనుకూలంగా లేని పాలసీలు, ఫారెక్స్ సమస్యలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ఇలా చాలా విషయాలు టెక్ కంపెనీలను వెనక్కి నెట్టేశాయి. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ తమ వ్యూహాలను తిరిగి ఆలోచిస్తూ, ఖర్చులను తగ్గించడంలో భాగంగా కొన్ని దేశాలలో కార్యాలయాల మూసివేతను నిర్ణయించింది.
ఒకప్పుడు ఫిజికల్ ప్రెజెన్స్ ఉన్న ప్రాంతాల్లోనే మైక్రోసాఫ్ట్ సేవలందించేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. క్లౌడ్ టెక్నాలజీ, రిమోట్ మోడల్స్ వచ్చాక అధికంగా ఫిజికల్ ఆఫీసుల అవసరం తగ్గింది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ తన సేవలను "అధికారిక భాగస్వాములు (certified partners)" ద్వారా అందిస్తోంది. ఇలా సంస్థ స్వయంగా కార్యాలయాలు నిర్వహించకపోయినా, సేవలు మాత్రం కొనసాగుతూనే ఉంటాయని వారు చెబుతున్నారు.
పాకిస్తాన్లోని ఐటీ వర్గాల్లో ఈ నిర్ణయం కొంత నిరాశను కలిగించింది. ''ఇది కేవలం ఉద్యోగం కోల్పోవడమే కాదు పాత పేజీ మూసుకున్నట్టుంది,'' అంటూ కొందరు మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు సోషల్ మీడియాలో స్పందించారు. దేశం నుంచి మరో గ్లోబల్ బ్రాండ్ వెళ్లిపోవడం, పెట్టుబడులపై ప్రభావం చూపుతుందనేది కూడా ఒక ఆందోళన.
మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజం నిష్క్రమణ తర్వాత, ఇతర మల్టీనేషనల్ కంపెనీలు కూడా తమ వ్యాపార వ్యూహాలను పునర్విమర్శించే అవకాశం ఉంది. అదే సమయంలో, స్థానిక కంపెనీలు, స్టార్ట్-అప్స్ ఈ ఖాళీని పూరించేందుకు ప్రయత్నించవచ్చు.
మొత్తంగా చూస్తే, ఇది పాక్ ప్రభుత్వానికి ఇది ఒక హెచ్చరిక లాంటి విషయమే. పాకిస్తాన్లో టెక్నాలజీ రంగంలో అవకాశాలు ఉన్నా, స్థిరమైన పాలసీలు, ఆర్థిక భద్రత, పారదర్శకత లేకపోవడమే గ్లోబల్ కంపెనీలు, పెట్టుబడిదారులు నమ్మకంతో ముందుకు రాకపోవడానికి ప్రధాన కారణం. స్థిరమైన పాలసీలు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉంటే, పాకిస్తాన్ టెక్ రంగం మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications