ఈ రోజుల్లో క్రిప్టోకరెన్సీ పై చాలా చర్చ జరుగుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా విజయం తర్వాత క్రిప్టోకు డిమాండ్ మళ్లీ భారీగా పెరిగింది. ఇలాంటి పరిస్థితిలో ఒక కంపెనీ సహ వ్యవస్థాపకుడు బిట్కాయిన్ క్రిప్టోకరెన్సీకి సంబంధించి సంచలనాత్మక ప్రకటన ఇచ్చారు.
మైక్రోస్ట్రాటజీ సహ వ్యవస్థాపకుడు మైఖేల్ సేలర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ Xలో ఒక పోస్ట్ ద్వారా వింత సలహా ఇచ్చారు. బిట్కాయిన్ ధరలో భారీ తగ్గుదల మధ్య ఆయన ఈ పోస్ట్ చేశారు. 'అవసరమైతే కిడ్నీ అమ్మేయ్, కానీ బిట్కాయిన్ ఉంచుకో' అంటూ ట్వీట్ చేసాడు. అతను చేసిన ఈ పోస్ట్ చాలా వైరల్ అయింది. చాలా మంది మైఖేల్ సేలర్ చేసిన్ పోస్ట్ వివాదాస్పదమైనది అని అంటున్నారు.

ఐఫోన్ నుండి ఇప్పటి వరకు బిట్కాయిన్
కొన్ని సంవత్సరాల క్రితం భారతదేశంలో ఐఫోన్ కొనడం ఒక కలగా భావించేవారు. ఐఫోన్ కొనేందుకు కిడ్నీ కూడా అమ్మేసెయ్ అని చెప్పిన నివేదికలు చాలా ఉన్నాయి. దీనిపై చాలా జోకులు, మీమ్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు బిట్కాయిన్ కొనడానికి కిడ్నీని అమ్మేస్తున్నారనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఒక బిట్కాయిన్ ధర దాదాపు రూ.74 లక్షలు.
బిట్కాయిన్ ఎంత పడిపోయింది?
ఇటీవలి కాలంలో బిట్కాయిన్ ధర భారీగా పడిపోయింది. ఇవాళ శనివారం ఉదయం 8 గంటలకు దీని ధర దాదాపు రూ.74 లక్షలు. గత ఒక నెలలో బిట్కాయిన్ 16 శాతానికి పైగా పడిపోయింది. ఒక నెల క్రితం బిట్కాయిన్ ధర రూ.88 లక్షల కంటే ఎక్కువగా ఉండేది. అదే సమయంలో కేవలం 5 రోజుల్లో బిట్కాయిన్ ధర దాదాపు 7 శాతం పడిపోయింది. బిట్కాయిన్ ధర తగ్గడానికి ద్రవ్యోల్బణ ఒత్తిడి, ట్రంప్ సుంకాల విధానాలే కారణమని చెబుతున్నారు.
ఎందుకు వివాదం?
మైఖేల్ సేలర్ ని క్రిప్టో మద్దతుదారుడిగా పరిగణిస్తారు. అవసరమైతే కిడ్నీని అమ్మేసెయ్ కానీ బిట్కాయిన్ ఉంచుకో అంటూ ఆయన చేసిన ట్వీట్ అసంబద్ధమని నిపుణులు అంటున్నారు. మైఖేల్ సేలర్ ఇలాంటి ప్రకటన చేయడం ఇదే మొదటిసారి కాదు. 2021లో కూడా, మైఖేల్ సేలర్ ఇలాంటి విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది.
ఆ సమయంలో అతను $57,000 కు బిట్కాయిన్ కొనడానికి ప్రజలు వారి ఇళ్లను తనఖా పెట్టాలని కోరాడు. 2022లో బిట్కాయిన్ క్రాష్ అయినప్పుడు అతని సలహా తప్పు అని నిరూపించబడింది. సోషల్ మీడియాలో ప్రజలు మైఖేల్ సేలర్ పోస్ట్ను తీవ్రంగా విమర్శించారు. చాలా మంది యూజర్లు అతను బిట్కాయిన్కు సపోర్ట్ ఇవ్వడానికి తీరని చర్యలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.


Click it and Unblock the Notifications