Anant Ambani: ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్లో ప్రపంచంలోని దిగ్గజ వ్యాపారవేత్తలు కొలువుదీరారు. వారిలో ప్రముఖ సామాజికమాధ్యమ దిగ్గజం గ్రూపు మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్ కూడా ఉన్నారు. అయితే ఇది కేవలం పెళ్లి వేడుక మాత్రమే కాదని, బిజినెస్ మీటింగ్గానూ పనిచేసినట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి.
ప్రముఖ మీడియా సంస్థ నివేదిక ప్రకారం.. చెన్నైలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ క్యాంపస్లో మెటా భారతదేశంలో తన మొదటి డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించిన భారీ ఒప్పందంపై ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్ అనంతరం సంతకాలు జరిగాయి. ప్రస్తుతం భారతీయ వినియోగదారుల డేటాను మెటా సింగపూర్ నుంచి ఆపరేట్ చేస్తోంది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో కంపెనీకి ఉన్న ఏకైక డేటా సెంటర్ ఇదే.

భారత్లో కొత్త డేటా సెంటర్ను ప్రారంభించడం వలన మెటా డేటా ప్రాసెసింగ్ వేగవంతం కానుంది. ఖర్చులు తగ్గడంతోపాటు స్థానిక ప్రకటనలు మరియు వినియోగదారుల అనుభవాన్ని కూడా పెంచుతుందని భావిస్తోంది. ఇందుకోసం చెన్నైలోని అంబత్తూర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని 10 ఎకరాల MAA10 క్యాంపస్ను మెటా ఎంచుకుంది. బ్రూక్ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్, రిలయన్స్ ఇండస్ట్రీస్ మరియు డిజిటల్ రియాల్టీ జాయింట్ వెంచర్ ద్వారా 100 మెగావాట్ల (MW) IT లోడ్ను ఇది నిర్వహించగలదు.
దేశంలో పెరుగుతున్న డేటా సెంటర్ పరిశ్రమ బిజినెస్లో మెజారిటీ వాటా దక్కించుకోవాలని మార్క్ జుకర్బర్గ్ భావిస్తున్నట్లు సమాచారం. దీనికితోడు కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన వ్యక్తిగత డేటా రక్షణ చట్టం నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డేటా నిల్వ మరియు ప్రాసెసింగ్ను స్థానికీకరించడానికి టెక్ దిగ్గజాల మధ్య పెరుగుతన్న ధోరణిని ఇది ప్రతిబింబిస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications