భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలహీనమైందని పేర్కొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు వాస్తవాన్ని గుర్తించాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీలు ఆపిల్, గూగుల్, మెటా (Meta Platforms Inc.) భారతదేశంలో భారీ పెట్టుబడులు పెడుతూ దేశ ఆర్థిక శక్తిని ముందుకు తీసుకువెళ్లేందుకు రెడీ అయ్యాయి. తాజాగా మెటా భారతదేశంలో తన 'వాటర్వర్త్' (Waterworth) అనే అండర్సీ కేబుల్ ప్రాజెక్ట్ను ప్రారంభించబోతోంది. ఇది కేవలం టెక్నాలజీ ప్రాజెక్ట్ మాత్రమే కాదు, భారతదేశాన్ని గ్లోబల్ డేటా నెట్వర్క్లలో కీలక కేంద్రంగా నిలబెట్టే మైలురాయి అవుతుందని చెప్పవచ్చు.
ఈ ప్రాజెక్ట్ కోసం మెటా భారతీయ ఐటీ కంపెనీ సిఫీ టెక్నాలజీస్ ను తన ల్యాండింగ్ పార్ట్నర్ గా ఎంపిక చేసింది. దీని విలువ సుమారు 5 మిలియన్ డాలర్లు (రూ. 44 కోట్లు). ఈ కేబుల్ ప్రాజెక్ట్కి ముంబై, విశాఖపట్నం ల్యాండింగ్ పాయింట్లుగా నిర్ణయించబడ్డాయి. సిఫీ ఇప్పటికే గూగుల్ యొక్క 'బ్లూ-రామన్' (Blue-Raman) సబ్సీ కేబుల్ ప్రాజెక్ట్లో భాగస్వామిగా ఉన్నందున, ఈ కొత్త ఒప్పందం భారతదేశం గ్లోబల్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వేగంగా ఎదుగుతోందని సూచిస్తోంది.

ఓపెన్కేబుల్స్ ఇంక్ వ్యవస్థాపకుడు సునీల్ ఠాగరే ప్రకారం.. మెటా కేబుల్ వ్యవస్థ రాబోయే 5 నుండి 10 సంవత్సరాల్లో దాదాపు 10 బిలియన్ డాలర్ల పెట్టుబడిని కలిగి ఉంటుంది. కేబుల్ వేయడానికే 2 బిలియన్ డాలర్లు, సెకనుకు 1 పెటాబిట్ (Pbps) సామర్థ్యం గల పరికరాలపై మరో 2 బిలియన్ డాలర్లు.. అలాగే భారతదేశంలో AI డేటా సెంటర్లు నిర్మించడానికో లేదా లీజుకు ఇవ్వడానికో కనీసం 6 బిలియన్ డాలర్లు ఖర్చు చేయనుంది. ఇది భారతదేశంలో మెటా పెట్టుబడుల పరంగా ఇప్పటివరకు అతిపెద్ద ప్రాజెక్ట్గా నిలుస్తుంది.
'వాటర్వర్త్' ప్రపంచంలోనే అతి పొడవైన జలాంతర్గామి కేబుల్ వ్యవస్థ. దాదాపు 50 వేల కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది అమెరికా, భారతదేశం, బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాలను కలుపుతుంది. కేబుల్ మార్గం ప్రత్యేకంగా "W" ఆకారంలో రూపొందించబడింది, ఎందుకంటే ఇది ప్రమాదకరమైన ఎర్ర సముద్రం మార్గాన్ని తప్పించుకోవడంలో సహాయపడుతుంది. గతంలో ఆ ప్రాంతంలో హౌతీ మిలిటెంట్ల దాడుల కారణంగా కొన్ని కేబుల్లు దెబ్బతిన్నాయి. వాటర్వర్త్ కేబుల్ 2029 నాటికి పూర్తి స్థాయిలో వేయబడుతుందని అంచనా వేస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్ భారతదేశానికి ఒక గేమ్-ఛేంజర్ కావచ్చని సునీల్ ఠాగరే పేర్కొన్నారు. దీని ద్వారా భారతదేశం.. ప్రపంచ AI మౌలిక సదుపాయాల కేంద్రంగా ఎదగగలదు. మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు భారతదేశంలో తమ డేటా సెంటర్ క్లస్టర్లుని వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ కేబుల్ వల్ల భారతీయ వినియోగదారులకు వేగవంతమైన డేటా ట్రాన్స్ఫర్, తక్కువ లేటెన్సీ,మెరుగైన కనెక్టివిటీ లభిస్తుంది.
భారతదేశంలో డేటా స్థానికీకరణ (Data Localization) చట్టాలు కఠినతరం అవుతున్న నేపథ్యంలో, మెటా తన డేటా భారతదేశంలోనే నిల్వ చేసే విధానంపై దృష్టి పెడుతోంది. దీని వల్ల దేశీయ సర్వర్ నెట్వర్క్లు, క్లౌడ్ సేవలు, AI మోడల్ ట్రైనింగ్ సామర్థ్యాలు మరింత బలపడతాయని అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications