ఫుట్బాల్ ప్రపంచంలో తిరుగులేని రారాజు.. అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ భారతదేశానికి వస్తున్నారు! భారతీయ అభిమానులకు ఇది ఒక శుభవార్త. ఈ మెస్సీ ఇండియా టూర్ (Messi India Tour) లో భాగంగా.. ఫుట్బాల్ దిగ్గజం మెస్సీని ప్రత్యక్షంగా కలవడానికి, మాట్లాడటానికి, చివరికి ఆయనతో ఒక ఫోటో దిగడానికి కూడా అవకాశం లభించింది. అయితే ఈ అరుదైన అవకాశం అంత సులభంగా దక్కదు. మెస్సీతో ప్రత్యేకంగా ఫోటో దిగాలంటే.. అభిమానులు రూ. 9.95 లక్షలు (ప్లస్ జీఎస్టీ) చెల్లించాల్సి ఉంటుంది. ఈ అత్యంత ఖరీదైన ఫోటో-ఆప్ కోసం కేవలం 100 స్లాట్ లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

హైదరాబాద్లో మెస్సీ ప్రత్యేక కార్యక్రమాలు
మెస్సీ పర్యటనలో భాగంగా హైదరాబాద్ ప్రధాన వేదిక కానుంది. శనివారం (డిసెంబర్ 13) రోజున మెస్సీ హైదరాబాద్ కు చేరుకోనున్నారు. ముందుగా ప్రీమియం ఫోటో-ఆప్ ఉంటుంది. ఫలక్నుమా ప్యాలెస్లో ఎంపిక చేసిన 100 మంది అభిమానులకు ఈ ప్రత్యేక ఫోటో అవకాశం లభిస్తుంది. ఆ తర్వాత ఉప్పల్ స్టేడియంలో మూడు గంటల పాటు బహిరంగ కార్యక్రమం ఉంటుంది. మెస్సీ సాయంత్రం 4 గంటలకు సిటీకి చేరుకుని.. 7 గంటలకు స్టేడియం ఈవెంట్కు హాజరవుతారు. ఈ పర్యటనలో అర్జెంటీనా స్టార్ రోడ్రిగో డి పాల్, ఉరుగ్వే స్ట్రైకర్ లూయిస్ సువారెజ్ కూడా మెస్సీతో పాటు పాల్గొంటారు.
ఎగ్జిబిషన్ మ్యాచ్
మెస్సీ సింగరేణి RR-9, అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్ మధ్య జరిగే 20 నిమిషాల ఫుట్బాల్ మ్యాచ్లో పాల్గొంటారు. చివరి ఐదు నిమిషాలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ మ్యాచ్లో ఆడనున్నారు. మెస్సీ చిన్నారులకు ఫుట్బాల్ క్లినిక్లో శిక్షణ ఇస్తారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన సన్మానం అందుకోనున్నారు. ఈ కార్యక్రమాల టికెట్లను 'డిస్ట్రిక్ట్ యాప్' ద్వారా విక్రయిస్తున్నారు.
కోల్కతాలో 'హోలా మెస్సీ' వేడుక
Messi India Tour లో కోల్కతా కూడా మరొక ముఖ్యమైన నగరం. డిసెంబర్ 13న కోల్కతాలో మెస్సీ కోసం గ్రాండ్ సెలబ్రేషన్స్ సిద్ధమవుతున్నాయి. అర్జెంటీనా ఫుట్బాల్ ఫ్యాన్ క్లబ్ కోల్కతా, సాల్ట్ లేక్లో మెస్సీ పట్ల తమ అభిమానాన్ని చాటుకుంటూ అద్భుతమైన ఏర్పాట్లు చేసింది. 'హోలా మెస్సీ' పేరుతో ఒక ఈవెంట్ను నిర్వహిస్తున్నారు. దీని బయటి భాగాన్ని మెస్సీ మియామి మాన్షన్లాగా నిర్మించారు. లోపల భాగాన్ని మెస్సీ కెరీర్ను సెలబ్రేట్ చేస్తూ మ్యూజియంగా మార్చారు. అభిమానులు మెస్సీ గెలిచిన లా లిగా, ఛాంపియన్స్ లీగ్, కోపా అమెరికా, ప్రపంచ కప్ ట్రోఫీలు, బ్యాలన్ డి'ఓర్, గోల్డెన్ బూట్ వంటి వాటి రెప్లికాలను చూడవచ్చు. మెస్సీ ఇప్పటివరకు చేసిన ప్రతి గోల్కు (896) ప్రాతినిధ్యం వహించేలా పైకప్పుకు 896 ఫుట్బాల్లను అలంకరించారు. మెస్సీ 20 ఏళ్ల ప్రయాణాన్ని తెలియజేస్తూ 200 మీటర్ల LED వాల్లో ఆయన అద్భుతమైన మ్యాచ్లలోని హైలైట్లను ప్రదర్శించనున్నారు.
భారతదేశంలో ఫుట్బాల్కు ఉన్న అభిమానం, ముఖ్యంగా మెస్సీ పట్ల ఉన్న ప్రేమ ఈ పర్యటన ద్వారా మరోసారి ప్రపంచానికి చాటి చెప్పబడుతోంది.
More From GoodReturns

Bengaluru: ఐటీ రేసులో రివర్స్ గేర్! బెంగళూరును దాటేసిన హైదరాబాద్.. లేటెస్ట్ రిపోర్ట్ ఇది!

Hyderabad: ఇక ట్రాఫిక్ టెన్షన్ లేదు! సిటీలో కొత్త అండర్ పాస్, స్టీల్ బ్రిడ్జికి లైన్ క్లియర్! ఎక్కడంటే..

Hyderabad: షాపింగ్, వెల్నెస్, గ్యాస్ట్రోనమీ.. హైదరాబాద్ బ్రాండింగ్ మార్చబోతున్న మూడు కీలక స్తంభాలు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications