Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఊటీలో ఇన్వెస్ట్మెంట్.. హిల్ స్టేషన్‌పై గురి..

Chiranjeevi Investments: రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని నటుడు చిరంజీవి. హైదరాబాదులో నివసిస్తున్న నటుడు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెట్టుబడులు సైతం పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన కన్ను తమిళనాడులోని ప్రముఖ పర్యాటక ప్రదేశం ఊటీ హిల్ స్టేషన్ పై పడిందని వెల్లడైంది.

ఊటీలో చిరంజీవి ఏకంగా 6 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. 123 తెలుగు సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మెగా స్టార్ చిరంజీవి తమిళనాడులోని ఊటీలో 16 కోట్ల రూపాయలు వెచ్చించి భూమిని కొనుగోలు చేశారని వెల్లడైంది. తేయాకు తోటలతో నిండిన ప్రాంతంలో మంచి వ్యూ పాయింట్‌లో ఈ స్థలాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో చాలా మంది సెలబ్రిటీలు, పరిశ్రమ వ్యక్తులు ఊటీలోని ఈ ప్రత్యేక ప్రాంతంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు.

Mega star Chiranjeevi bought 6 acres in Ooty with 16 crores Investment Know details

ఈ స్థలంలో చిరంజీవి కుటుంబం విలాసవంతమైన ఫామ్‌హౌస్‌ను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి కుమారుడు రామ్‌చరణ్‌ కూడా తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ హీరోగా ఉన్నారు. అలాగే గత ఏడాది ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు సైతం వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామ్‌చరణ్‌ అతని భార్య ఉపాసన ఇద్దరూ స్వయంగా ఈ ప్రదేశాన్ని సందర్శించి ఫామ్‌హౌస్‌ను ఎక్కడ, ఎలా నిర్మించాలనే దానిని పర్యవేక్షిస్తున్నారని తెలుస్తోంది. ఈ ఫామ్ హౌస్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని సమాచారం. వాస్తవానికి నటుడు చిరంజీవి తన కెరీర్ ప్రారంభం నుంచి రియల్ ఎస్టేట్ పెట్టుబడులపై ఆసక్తిని కలిగి ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు హైదరబాదులో సైతం అనేక రియల్టీ పెట్టుబడులు ఉన్నాయి.

చిరంజీవికి బెంగుళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని దేవనహళ్లిలో అతనికి ఇప్పటికే ఫామ్‌హౌస్ ఉంది. సెలవుల్లో కుటుంబ సమేతంగా ఈ ఫామ్‌హౌస్‌కు తరచూ వెళ్తుంటారని సమాచారం. ప్రస్తుతం చిరంజీవి విశ్వంబర అనే భారీ సోషియో ఫాంటసీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని జనవరిలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ చిత్రంలో త్రిష, కునాల్ కపూర్, ఆషికా రంగనాథన్, మీనాక్షి చౌదరి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

చిరంజీవిని తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా స్టార్ అని పిలుస్తారని మనందరికీ తెలిసిందే. 69 ఏళ్ల చిరంజీవి రూ.1,650 కోట్ల ఆస్తులను కలిగి ఉన్నారు. ఇప్పటికే ఆయన 150కి పైగా చిత్రాల్లో నటించారు. అలాగే భారత ప్రభుత్వం నుంచి ఆయన అందించిన సేవలకు గాను పద్మభూషణ్, పద్మవిభూషణ్ సహా అవార్డులు అందుకున్నారు. 1990లలోనే చిరంజీవి అత్యధిక పారితోషికం అందుకున్న వ్యక్తిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆయన వారసత్వాన్ని కుమారుడు రామ్ చరణ్ తో పాటు మిగిలిన మెగా హీరోలు ముందుకు తీసుకెళుతున్నారు. అలాగే రామ్‌చరణ్ భార్య ఉపాసన అపోలో హాస్పిటల్స్ గ్రూప్ యజమాని ప్రతాప్ రెడ్డి మనవరాలు, అలాగే ఆమె హాస్పిటల్ చైన్ వ్యాపారంలో కీలక పాత్రలో కొనసాగుతున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+