రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీకి సన్నిహితుడు, సంస్థలో సీనియర్ అధికారి అయిన ప్రకాష్ షా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రాపంచిక అనుబంధాలను, కోట్ల సంపదను విడిచిపెట్టి ఆయన సన్యాసి జీవితాన్ని స్వీకరించారు. రిలయన్స్లో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ అంబానీకి 'కుడి భుజం' అని పేరుగాంచిన ప్రకాష్ షా తన ఏడాది జీతం సుమారు రూ.75 కోట్లు ఉన్న ఉద్యోగాన్ని వదులుకున్నారు. ఇంతటి భారీ జీతం, సంపదను వదిలి సన్యాసి జీవితాన్ని ఆయన ఎందుకు ఎంచుకున్నారో తెలుసా..

సన్యాసం స్వీకరించాలనే నిర్ణయం: 63 సంవత్సరాల వయసులో ఉద్యోగ విరమణ చేసిన వెంటనే ప్రకాష్ షా, అతని భార్య నైనా షా ఇద్దరూ మహావీర్ జయంతి సందర్భంగా దీక్ష స్వీకరించారు. ప్రకాష్ షా చాలా కాలంగా సన్యాసం తీసుకోవాలని కోరుకున్నారు, కానీ కోవిడ్ మహమ్మారి కారణంగా దానిని వాయిదా వేశారు. దీక్ష అనేది ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ, దీనిలో ఒక వ్యక్తి అన్ని భౌతిక వస్తువులను వదిలి మోక్ష మార్గంలో పయనిస్తారు.
విద్యా నేపథ్యం, కుటుంబ వివరాలు: ప్రకాష్ షా కెమికల్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఐఐటీ బాంబే నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశారు. అతని భార్య నైనా కామర్స్ గ్రాడ్యుయేట్. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఒకరు ఇప్పటికే దీక్ష తీసుకున్నారు, మరొక కుమారుడు పెళ్లి చేసుకుని ఒక బిడ్డ కూడా జన్మించారు.
రిలయన్స్లో కీలక పాత్ర: రిలయన్స్లో తన సుదీర్ఘ పదవీకాలంలో జామ్నగర్ పెట్కోక్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్ అండ్ పెట్కోక్ మార్కెటింగ్తో సహా చాల పెద్ద ప్రాజెక్టులకు ప్రకాష్ షా నాయకత్వం వహించారు. అతని పని నీతి, నాయకత్వ నైపుణ్యాల కోసం అంబానీ కుటుంబం ఆయనను ఎంతగానో గౌరవించింది. ముఖేష్ అంబానీకి అత్యంత విశ్వసనీయ, సన్నిహిత అధికారులలో ప్రకాష్ షా ఒకరు.
సన్యాసి జీవితం: ప్రకాష్ షా ఇప్పుడు జైన సన్యాసిగా జీవిస్తున్నారు. అతను చెప్పులు లేకుండా నడవడం, సాధారణ తెల్లని దుస్తులు ధరించడం అలాగే భిక్షాటనపై ఆధారపడి జీవిస్తాడు. అతని దీక్షా కార్యక్రమం ముంబైలోని బోరివలి ప్రాంతంలో జరిగింది. ఇది పూర్తిగా మత సంప్రదాయాల ప్రకారం జరిగింది. ప్రకాష్ షాకు ఇప్పుడు 64 సంవత్సరాలు. 'దీక్ష' అనేది ఒక వ్యక్తి సన్యాసం ఆచరించడానికి ప్రతిజ్ఞ చేసే ఒక ఆచారం. ఒక వ్యక్తి 'దీక్ష' తీసుకున్న తర్వాత వారి లక్ష్యం ఎటువంటి పాపం, చెడు పనులు చేయకుండా ఇంకా మోక్షాన్ని పొందడానికి మంచి పనులు చేయడమే.


Click it and Unblock the Notifications