ఐరోపాకు చెందిన ఆరోగ్య, వైద్య పరీక్షల సంస్థ మెడికవర్ గ్లోబల్ తెలుగు రాష్ట్రాలలో మరిన్ని ఆసుపత్రులను ప్రారంభించనుంది. ఇప్పటికే హైదరాబాదులో ఓ హాస్పిటల్ను నిర్వహిస్తోన్న ఈ సంస్థ తాజాగా నెల్లూరులో 250 బెడ్స్ హాస్పిటల్ను ప్రారంభించింది. 100 పడకలతో అంతర్జాతీయ స్థాయి క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది.

రూ.700 కోట్ల వరకు పెట్టుబడులు
మెడికవర్ సంస్థ దేశీయంగా ఈక్విటీ, డెట్ రూపాల్లో రూ.700 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టింది. క్యాన్సర్ ఆసుపత్రి సహా ఇతర ప్రాజెక్ట్స్ కోసం మరో రూ.300 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు మెడికవర్ సీఈవో ప్రెడ్రిక్ రాగ్మార్గ్ పేర్కొన్నారు. 2020 డిసెంబర్ లోగా హైదరాబాద్లో 500 బెడ్స్ కలిగిన హాస్పిటల్ని తీసుకునే అంశంపై చర్చలు జరుగుతున్నట్లు చెప్పారు.

విశాఖ, శ్రీకాకుళంలోను..
విశాఖపట్నంలో 200 బెడ్స్, శ్రీకాకుళంలో 300 బెడ్స్ హాస్పిటల్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నెల్లూరులో 250 బెడ్స్ కలిగిన హాస్పిటల్ కోసం రూ.150 కోట్ల వరకు వెచ్చించింది. దీనిని 750 బెడ్స్ స్థాయికి మార్చనున్నారు. ఇక్కడే రూ.30 కోట్లతో 100 బెడ్స్ కలిగిన అత్యాధునిక అంకాలజీ ఇనిస్టిట్యూట్ను ప్రారంభించనున్నారు.

త్వరలో మరో 2,000 మంది ఉద్యోగులు
మెడికవర్ ఇండియా చైర్మన్ డాక్టర్ అనిల్ కృష్ణ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో తమ సంస్థ ఆసుపత్రులను కలిగి ఉందని చెప్పారు. 6,500 మంది ఉద్యోగులు ఉన్నారని, త్వరలో మరో 2,000 మందిని నియమించుకుంటామని చెప్పారు. 2,300 మంది స్థానిక ఆరోగ్య సేవల ప్రొవైడర్లతో భాగస్వామ్యం కలిగి ఉన్నట్లు చెప్పారు.

అనంత, కడపల్లోను..
ఆంధ్రప్రదేశ్లో మరింత విస్తరిస్తామని కంపెనీ తెలిపింది. ఇందుకు మరిన్ని పెట్టుబడులు పెడతామని తెలిపింది. విశాఖలో తన కేంద్రాలను మూడుకు పెంచుకోనుంది. మెడికవర్కు అన్ని రాష్ట్రాల్లో కలిపి 2,500 బెడ్స్ కలిగిన హాస్పిటల్స్ ఉన్నాయి. అనంతపురం, కడపలోను ఏర్పాటు చేయనుంది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధర పెరగడంతో వినియోగదారులు కొత్త స్కెచ్.. రూ.4 లక్షల కోట్లు దాటిన పసిడి రుణాలు..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బెంగళూరు-హైదరాబాద్ మధ్య ప్రయాణం గంటలే.. 110 కి.మీ.వేగంతో కొత్త రైలు వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..

బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే.. 11 ఇంటర్ఛేంజెస్ కనెక్టివిటితో బిజినెస్ కారిడార్ రెడీ..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

డబ్బు కావలిసినంత ఉన్నా పర్సనల్ లోన్ల వైపు పరిగెత్తుతున్న ధనవంతులు.. కారణం ఏంటంటే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications