న్యూఢిల్లీ: ఎండీహెచ్ స్సైసెస్ గ్రూప్ కంపెనీల అధినేత మహాశయ్ ధరంపాల్ గులాటీ కన్నుమూశారు. ఆయన వయస్సు 98 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దేశ రాజధానిలోని మాతా చానన్ దేవి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడం, అదే సమయంలో గుండెపోటు రావడంతో గురువారం తెల్లవారు జామున ఆయన తుదిశ్వాస విడిచారు. మహాశయ్ గులాటీ మరణం పట్ల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
మసాలా దినుసుల రంగంలో మహారాజుగా గుర్తింపు పొందారు మహాశయ్. ఎండీహెచ్ పేరుతో ప్రత్యేకంగా స్పెసెస్ కంపెనీని నెలకొల్పారు. దశలవారీగా దాన్ని విస్తరింపజేశారు. ఎండీహెచ్ పూర్తిపేరు.. మహాశియన్ దీ హట్టి. 1923లో అవిభాజ్య భారత్లోని సియాల్ కోట్లో జన్మించారు. ప్రస్తుతం ఈ నగరం పాకిస్తాన్లో ఉంది. మసాలా దినుసుల వ్యాపారం గులాటీ కుటుంబంలో వంశపారపర్యంగా వస్తోంది. తన తండ్రి మహాశయ్ చున్నీలాల్ గులాటీ వారసత్వాన్ని మహాశయ్ కొనసాగించారు. సియాల్కోట్లో మసాలా దినుసుల వ్యాపారాన్ని చేపట్టారు.

దేశ విభజన అనంతరం ఆయన తన కుటుంబంతో సహా ఢిల్లీకి తరలి వచ్చారు. కరోల్బాగ్లో నివాసం ఉంటున్నారు. తొలుత కరోల్ బాగ్లో ఓ చిన్న దుకాణంగా ఎండీహెచ్ మసాలా దినుసుల విక్రయాలను ప్రారంభించారు. క్రమంగా అది మహావృక్షంలా మారింది. దేశంలోనే అతిపెద్ద మసాలా తయారీ సంస్థగా ఆవిర్భవించింది. ప్రముఖ వ్యాపారవేత్తగా మహాశయ్ ధరంపాల్ గులాటీ పేరు ప్రఖ్యాతులు సాధించారు. 2019లో ఆయన మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ను అందుకున్నారు. అత్యంత స్ఫూర్తిదాయక వ్యాపార, పారిశ్రామికవేత్తగా నిలిచారాయన.
మహాశయ్ గులాటీ మరణం పట్ల అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి సానుభూతిని ప్రకటించారు. మహాశయ్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఇప్పటిదాకా తాను ఆయనను కలుసుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఆయన నుంచి తాను స్ఫూర్తిపొందానని చెప్పారు. మహాశయ్ మరణం తనకు దిగ్భ్రాంతి కలిగించిందని మనీష్ సిసోడియా చెప్పారు. ఆయనతో కలిగి దిగిన కొన్ని ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
More From GoodReturns

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications