For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టాప్ 5లోని మూడు కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.78 లక్షల కోట్లు జంప్

|

గతవారం టాప్ 5లోని మూడు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.78 లక్షల కోట్లు పెరిగింది. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా పెరిగింది. బెంచ్ మార్క్ బీఎస్ఈ సెన్సెక్స్ గతవారం 1532.77 పాయింట్లు లేదా 2.30 శాతం లాభపడి, 54,326 పాయింట్ల వద్ద ముగిసింది. గురువారం నాటి సెషన్‌లో భారీగా నష్టపోయినప్పటికీ, శుక్రవారం సెషన్‌లో అంతకుమించి 1534 పాయింట్లు లేదా 2.91 శాతం లాభాల్లో ముగిసింది.

గతవారం రిలయన్స్ ఇండస్ట్రీస్, HDFC బ్యాంకు, హిందూస్తాన్ యూనీలీవర్ కంపెనీల మార్కెట్ క్యాప్ పెరిగింది. టాప్ 5లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ తగ్గింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్క్యాప్ రూ.1,31,320.8 కోట్లు పెరిగి రూ.17,73,889.78 కోట్లకు, హిందూస్తాన్ యూనీవర్ మార్కెట్ క్యాప్ రూ.30,814.89 కోట్లు పెరిగి రూ.5,46,397.45 కోట్లకు, HDFC బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.16,515.02 కోట్లు పెరిగి రూ.7,33,156.15 కోట్లకు చేరుకుంది. అదే సమయంలో టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ.43,743.96 కోట్లు తగ్గి రూ.12,05,254.93 కోట్లకు, ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ.20,129.66 కోట్లు క్షీణించి రూ.6,12,303.26 కోట్లకు తగ్గింది.

Mcap of 3 of top five firms jumps Rs 1.78 trillion

మంగళవారం ఎల్ఐసీ 8 శాతం డిస్కౌంట్‌తో లిస్ట్ అయింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.5,22,602.94 కోట్లుగా నమోదయింది. ఆ తర్వాత ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.4,93,251.86 కోట్లు, ఎస్బీఐ మార్కెట్ క్యాప్ రూ.4,12,763.28 కోట్లు, HDFC మార్కెట్ క్యాప్ రూ.3,99,512.68 కోట్లు, భారతీ ఎయిర్‌టెల్ మార్కెట్ క్యాప్ రూ.3,77,686.72 కోట్లకు చేరుకుంది.

English summary

టాప్ 5లోని మూడు కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.78 లక్షల కోట్లు జంప్ | Mcap of 3 of top five firms jumps Rs 1.78 trillion

Three of the top five valued firms together added Rs 1,78,650.71 crore to their market valuation last week, led by Reliance Industries.
Story first published: Sunday, May 22, 2022, 17:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X