40,453 ఎకో కార్లను రీకాల్: మారుతీ సుజుకీ ప్రకటన
దిగ్గజ కార్ల కంపెనీ మారుతీ సుజుకీ మల్టీ పర్పస్ వాహనం ఎకో వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా 40,453 యూనిట్లను రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది. నవంబర్ 4వ తేదీ 2019 నుండి ఫిబ్రవరి 25, 2019 వరకు తయారైన ఈ వాహనాల్లో హెడ్ ల్యాంప్ ఫిక్స్కు సంబంధించిన సమస్యలు తలెత్తడంతో వెనక్కి పిలిపిస్తున్నట్లు తాజా ప్రకటనలో తెలిపింది.
దీనిని ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం దేశీయంగా వినియోగిస్తున్న ఈ వాహన ఓనర్లు మారుతీ డీలర్ల వద్ద ఉచితంగా మరమ్మతులు చేయించుకోవచ్చు. ఎకో వాహనం కార్గోతో పాటు పాసింజర్ క్యారియర్ సౌకర్యం కలిగి ఉంది. అధిక లోడింగ్ సామర్థ్యం కలిగి ఉంది.
దేశంలోని ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఈ ఏడాది జనవరి నెలలో తీసుకు వచ్చారు. దీని సీఎన్జీ వర్షన్ను మార్చి నెలలో తీసుకు రానున్నారు. ప్రారంభ ధర రూ.4.64 లక్షలు (ఎక్స్-షోరూం ధర ఢిల్లీ). ఎకో1.2 లీటర్, ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్తో 73bhp, 101nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్తో జత చేయబడిన ఇంజిన్ ఇది.