కొనుగోలుదారులకు మారుతీ సుజుకీ షాక్, రూ.22,500కు ధరల పెంపు

మారుతీ సుజుకీ షాకిచ్చింది. స్విఫ్ట్, సెలెరియో మినహా మిగిలిన కార్ల ధరలను రూ.22,500 వరకు పెంచింది. పెరిగిన ముడి సరుకు వ్యయ భారాన్ని కొంత తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వివిధ మోడల్స్ ఢిల్లీ ఎక్స్ షోరూం ధరలో 1.6 శాతం వరకు పెంపు ఉంటుందని తెలిపింది. శుక్రవారం నుండి ధరల పెంపు అమల్లోకి వచ్చిందని స్పష్టం చేసింది. ఈ మేరకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

ఈ ఏడాదిలో మారుతి సుజుకి కార్ల ధ‌ర‌లను పెంచడం రెండోసారి. అంటే జనవరి నెల నుండి ఇప్పుడు పెంచడం రెండోసారి. ఎంపిక చేసిన మోడ‌ల్ కార్ల‌పై స‌గ‌టున రూ.34 వేల చొప్పున పెరిగాయి. స్టీల్ వంటి ముడి సరుకు, గ్లోబ‌ల్ క‌మోడిటీ ధ‌ర‌లు నిల‌క‌డ‌గా పెరుగుతున్న నేపథ్యంలో కార్ల తయారీ కాస్త భారంగా మారింది. అలాగే గ్లోబ‌ల్ మార్కెట్లో సెమీ కండక్టర్స్ కొర‌త అధిక వ్య‌యానికి కారణంగా మారింది.

 Maruti Suzuki car prices hiked by up to Rs. 22,500

జనవరి నెలలో మారుతీ సుజుకీ తన ఆల్టో, ఎస్ ప్రెస్సో పైన రూ.34,000 వరకు పెంచాయి. మారుతీ సుజుకీ దేశంలో 14 మోడల్స్‌ను విక్రయిస్తోంది. మారుతీ సుజుకీతో పాటు ఇతర వాహన కంపెనీలు కూడా ధరలను పెంచాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+