కరోనా వైరస్ నేపథ్యంలో కంపెనీలు వేతనాలు పెంచడం కంపెనీలకు ఇబ్బందికరంగా మారింది. ఈ మహమ్మారి సమయంలోను కొన్ని కంపెనీలు శాలరీ పెంచాయి. ఇటీవలి కాలంలో ఆర్థిక కార్యకలాపాలు పెరగడంతో ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండి శాలరీ పెంచని కంపెనీలు ఇప్పుడు ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెబుతున్నాయి. గత మూడు నెలలుగా ఆటో సేల్స్ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దీంతో ఇప్పుడు మారుతీ, హ్యుండాయ్, టీవీఎస్, హీరో మోటో కార్ప్, రాయల్ ఎన్ఫీల్డ్ తమ సంస్థలో పని చేసే ఉద్యోగులకు శాలరీ పెంచే ఆలోచన చేస్తున్నాయి.

మహీంద్రా అండ్ మహీంద్రా వేతనాల పెంపు
నివేదిక ప్రకారం భారతదేశపు అతిపెద్ద ట్రాక్టర్ తయారీ, యుటిలిటీ వాహన తయారీ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా డిసెంబర్ నుండి వేతనాల పెంపుకు సిద్ధమైందని తెలుస్తోంది. సాధారణంగా ఆటోమేకర్స్ ఆగస్ట్ 1న ఇంక్రిమెంట్స్ ప్రకటిస్తారు. ఈసారి కరోనా కారణంగా వేతనాల పెంపు ఆలస్యం అయింది. కరోనా లాక్ డౌన్, ఆటో సేల్స్ భారీగా పడిపోవడంతో ఉద్యోగాల కోత, వేతనాల కోత చోటు చేసుకుంది. ఇప్పుడు సేల్స్ క్రమంగా గాడిన పడుతుండటంతో ఉద్యోగాలు పెరగడంతో పాటు వేతనాల పెంపు వైపు అడుగులు వేస్తున్నారు. తమ కార్యకలాపాలు దాదాపు సాధారణ స్థితికి వచ్చాయని, ఏడాది ప్రాతిపదికన వృద్ధి పైన దృష్టి సారించామని, తమ కంపెనీ ఇంక్రిమెంట్ డిసెంబర్ నుండి అమలులోకి వస్తుందని మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

ఈ సంస్థలు కూడా
మారుతీ సుజుకీ, హ్యుండాయ్, హీరో మోటో కార్ప్, టీవీఎస్ మోటార్స్, రాయల్ ఎన్ఫీల్డ్, ఎంజీ మోటార్స్, కియా మోటార్స్,కూడా ఉద్యోగులకు వేతనాలు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్టోబర్, నవంబర్ నెలల్లో సేల్స్ క్రమంగా పెరుగుతుండటంతో ఇంక్రిమెంట్స్ పైన దృష్టి సారించారని తెలుస్తోంది. మారుతీ సుజుకీ అక్టోబర్ నెలలో ఉద్యోగులకు వేతన పెంపును ప్రకటించిందని తెలుస్తోంది. టూవీలర్ మేకర్ హీరో మోటో కార్ప్లో మెరిట్ ఆధారిత వేతనాల పెంపు ఉంది.

పెరిగిన సేల్స్
గత మూడు నెలలుగా పాసింజర్ వెహికిల్ సేల్స్ 17 శాతం మేర పెరిగాయి. దసరా, దీపావళి సందర్భంగా డిమాండ్ పెరిగి ఆటో సేల్స్ సానుకూలంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఉద్యోగుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు కంపెనీలు మొగ్గు చూపాయి. గత రెండు నెలల్లో గ్రామీణ డిమాండ్, ఎంట్రీ లెవల్ ప్యాసింజర్ కార్లతో పాటు బైక్స్ పెరుగుదల రికవరీ ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉంది. అయితే కొన్ని కంపెనీలు ఈ ఏడాది ఇంక్రిమెంట్ ఇవ్వకూడదని నిర్ణయించాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications