కరోనా వైరస్ నేపథ్యంలో కంపెనీలు వేతనాలు పెంచడం కంపెనీలకు ఇబ్బందికరంగా మారింది. ఈ మహమ్మారి సమయంలోను కొన్ని కంపెనీలు శాలరీ పెంచాయి. ఇటీవలి కాలంలో ఆర్థిక కార్యకలాపాలు పెరగడంతో ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండి శాలరీ పెంచని కంపెనీలు ఇప్పుడు ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెబుతున్నాయి. గత మూడు నెలలుగా ఆటో సేల్స్ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దీంతో ఇప్పుడు మారుతీ, హ్యుండాయ్, టీవీఎస్, హీరో మోటో కార్ప్, రాయల్ ఎన్ఫీల్డ్ తమ సంస్థలో పని చేసే ఉద్యోగులకు శాలరీ పెంచే ఆలోచన చేస్తున్నాయి.

మహీంద్రా అండ్ మహీంద్రా వేతనాల పెంపు
నివేదిక ప్రకారం భారతదేశపు అతిపెద్ద ట్రాక్టర్ తయారీ, యుటిలిటీ వాహన తయారీ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా డిసెంబర్ నుండి వేతనాల పెంపుకు సిద్ధమైందని తెలుస్తోంది. సాధారణంగా ఆటోమేకర్స్ ఆగస్ట్ 1న ఇంక్రిమెంట్స్ ప్రకటిస్తారు. ఈసారి కరోనా కారణంగా వేతనాల పెంపు ఆలస్యం అయింది. కరోనా లాక్ డౌన్, ఆటో సేల్స్ భారీగా పడిపోవడంతో ఉద్యోగాల కోత, వేతనాల కోత చోటు చేసుకుంది. ఇప్పుడు సేల్స్ క్రమంగా గాడిన పడుతుండటంతో ఉద్యోగాలు పెరగడంతో పాటు వేతనాల పెంపు వైపు అడుగులు వేస్తున్నారు. తమ కార్యకలాపాలు దాదాపు సాధారణ స్థితికి వచ్చాయని, ఏడాది ప్రాతిపదికన వృద్ధి పైన దృష్టి సారించామని, తమ కంపెనీ ఇంక్రిమెంట్ డిసెంబర్ నుండి అమలులోకి వస్తుందని మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

ఈ సంస్థలు కూడా
మారుతీ సుజుకీ, హ్యుండాయ్, హీరో మోటో కార్ప్, టీవీఎస్ మోటార్స్, రాయల్ ఎన్ఫీల్డ్, ఎంజీ మోటార్స్, కియా మోటార్స్,కూడా ఉద్యోగులకు వేతనాలు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్టోబర్, నవంబర్ నెలల్లో సేల్స్ క్రమంగా పెరుగుతుండటంతో ఇంక్రిమెంట్స్ పైన దృష్టి సారించారని తెలుస్తోంది. మారుతీ సుజుకీ అక్టోబర్ నెలలో ఉద్యోగులకు వేతన పెంపును ప్రకటించిందని తెలుస్తోంది. టూవీలర్ మేకర్ హీరో మోటో కార్ప్లో మెరిట్ ఆధారిత వేతనాల పెంపు ఉంది.

పెరిగిన సేల్స్
గత మూడు నెలలుగా పాసింజర్ వెహికిల్ సేల్స్ 17 శాతం మేర పెరిగాయి. దసరా, దీపావళి సందర్భంగా డిమాండ్ పెరిగి ఆటో సేల్స్ సానుకూలంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఉద్యోగుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు కంపెనీలు మొగ్గు చూపాయి. గత రెండు నెలల్లో గ్రామీణ డిమాండ్, ఎంట్రీ లెవల్ ప్యాసింజర్ కార్లతో పాటు బైక్స్ పెరుగుదల రికవరీ ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉంది. అయితే కొన్ని కంపెనీలు ఈ ఏడాది ఇంక్రిమెంట్ ఇవ్వకూడదని నిర్ణయించాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications