గత ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా అమ్ముడుపోయిన కార్లలో మారుతీకి చెందిన స్విఫ్ట్ మొదటి స్థానంలో ఉంది. ఈ మేరకు మారుతీ సుజుకీ మంగళవారం వెల్లడించింది. ఆ తర్వాత స్థానాల్లో బాలెనో, వ్యాగన్ఆర్, ఆల్టో, డిజైర్ ఉన్నాయి. ఈ ఐదు మోడల్స్ వరుసగా నాలుగో ఏడాది స్థిరమైన విక్రయాలు నమోదు చేశాయని తెలిపింది. 1.72 లక్షల కార్ల విక్రయాలతో స్విఫ్ట్ మోడల్ మొదటి స్థానంలో నిలిచింది. 2020-21లో సేల్ అయిన పాసింజర్ వెహికిల్స్లో ఈ మోడళ్ల వాటా 30 శాతమని మారుతీ తెలిపింది.

మారుతీ అదుర్స్
తమ కస్టమర్లు తమపై ఉంచిన విశ్వాసం స్థిరంగా ఉందని మారుతీ సుజుకీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, (మార్కెటింగ్, సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ అన్నారు. 2017-18 నుండి ఈ 5 మోడల్స్ అత్యధికంగా అమ్ముడవుతోన్న జాబితాలో మొదటి ఐదు స్థానాల్లో ఉంటున్నాయి. 2020-21లో అత్యధికంగా అమ్ముడుపోయిన 10 మోడల్స్లో మారుతీ సుజుకీ కంపెనీవే ఏడు ఉండటం గమనార్హం. స్విఫ్ట్ 1.72 లక్షలు, బాలెనో 1.63 లక్షలు, వ్యాగన్ ఆర్ 1.59 లక్షలు, డిజైర్ 1.28 లక్షలతో టాప్ 5లో ఉన్నాయి.

పదిహేనేళ్లయినా..
మారుతీ స్విఫ్ట్ మోడల్ మార్కెట్లోకి వచ్చి పదిహేనేళ్లవుతోంది. అయినప్పటికీ ఇప్పటికీ సేల్స్లో దూసుకెళ్తోంది. మారుతీ సుజుకీ ఇండియా 2021 స్విఫ్ట్ ఫేస్లిస్ట్ను ఇటీవల విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.5.73 లక్షలకు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) విడుదల చేసింది. టాప్ అఫ్ లైన్ వేరియంట్ రూ.8.41 లక్షలకు (ఎక్స్ షోరూం, ఢిల్లీ) లభిస్తోంది. 2021 మారుతీ సుజుకీ స్విఫ్ట్ సరికొత్త నెక్స్ట్ జెన్ కే సిరీస్ డ్యూయల్ జెట్, డ్యూయల్ వివిటి పెట్రోల్ ఇంజన్తో వస్తోంది.

35 శాతం వాటా దీనిదే
మారుతీ సుజుకీ ఇండియా సేల్స్కు ఎన్నో కారణాలు ఉన్నాయి. భారత్లో అత్యధికంగా అమ్ముడవుతోన్న టాప్ 5 కార్లలో ఒకటిగా స్విఫ్ట్ నిలిచింది. మార్కెట్ షేర్లో 35 శాతం వాటా దీనిదే కావడం గమనార్హం. మార్కెట్లో బ్యాంకులు అత్యల్పంగా 7 శాతం నుండి 9 శాతం మధ్య వెహికిల్ లోన్ అందించడం కూడా కారు సేల్స్ పెరగడానికి కొంత దోహదపడ్డాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications