కరోనా వైరస్ కారణంగా బుధవారం భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం కాస్త తేరుకున్నాయి. ఉదయం గం.09:17 సమయానికి సెన్సెక్స్ 225.73 పాయింట్లు (0.59%) లాభంతో 38,635.21, నిఫ్టీ 70.60 పాయింట్ల ( 0.63%) లాభంతో 11,321.60 వద్ద ట్రేడ్ అయింది. 573 షేర్లు లాభాల్లో, 169 షేర్లు నష్టాల్లో ఉండగా, 31 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. మధ్యాహ్నం గం.12.55 సమయానికి సెన్సెక్స్ దాదాపు 400 పాయింట్లు ఎగిసి 38,803.25కు చేరుకుంది. నిఫ్టీ 110.65 (0.98%) పాయింట్లు ఎగిసి 11,361.65కి చేరుకుంది.
దాదాపు అన్ని రంగాల షేర్లు కూడా లాభాల్లోనే ట్రేడ్ అయ్యాయి. ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఫార్మా రంగాల షేర్లు దాదాపు 1 శాతం వరకు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు లాభాలు గడించాయి. టాప్ గెయినర్స్ జాబితాలో యస్ బ్యాంకు, హెచ్యూఎల్, ఎస్బీఐ, హెచ్సీఎల్ టెక్, కొటక్ మహీంద్రా ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో జీ ఎంటర్టైన్మెంట్, భారతీ ఇన్ఫ్రాటెల్, గ్రాసిమ్, వేదాంత, హిండాల్కో ఉన్నాయి.
కరోనా వైరస్ ప్రభావం.. మరిన్ని బిజినెస్ న్యూస్

యస్ బ్యాంకులో వాటాల కొనుగోలుపై ఎస్బీఐ కన్సార్టియంను ఏర్పాటు చేస్తుందనే నివేదికలన నేపథ్యంలో ఈ బ్యాంకు షేర్లు ఎగిశాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి నిఫ్టీ 13,500 మార్క్ చేరుకోవచ్చునని, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకులు భారీ లాభాల్లో ఉండవచ్చునని కొటక్ అంచనా వేసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 73.26 వద్ద ట్రేడ్ అయింది. బుధవారం 73.21 వద్ద క్లోజ్ అయింది.
More From GoodReturns

కుప్పకూలిన ఆసియా స్టాక్ మార్కెట్.. దెబ్బకు దక్షిణ కొరియా మార్కెట్లో నిలిచినపోయిన ట్రేడింగ్..

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!



Click it and Unblock the Notifications