భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 350 పాయింట్లు అప్
కరోనా వైరస్ కారణంగా బుధవారం భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం కాస్త తేరుకున్నాయి. ఉదయం గం.09:17 సమయానికి సెన్సెక్స్ 225.73 పాయింట్లు (0.59%) లాభంతో 38,635.21, నిఫ్టీ 70.60 పాయింట్ల ( 0.63%) లాభంతో 11,321.60 వద్ద ట్రేడ్ అయింది. 573 షేర్లు లాభాల్లో, 169 షేర్లు నష్టాల్లో ఉండగా, 31 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. మధ్యాహ్నం గం.12.55 సమయానికి సెన్సెక్స్ దాదాపు 400 పాయింట్లు ఎగిసి 38,803.25కు చేరుకుంది. నిఫ్టీ 110.65 (0.98%) పాయింట్లు ఎగిసి 11,361.65కి చేరుకుంది.
దాదాపు అన్ని రంగాల షేర్లు కూడా లాభాల్లోనే ట్రేడ్ అయ్యాయి. ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఫార్మా రంగాల షేర్లు దాదాపు 1 శాతం వరకు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు లాభాలు గడించాయి. టాప్ గెయినర్స్ జాబితాలో యస్ బ్యాంకు, హెచ్యూఎల్, ఎస్బీఐ, హెచ్సీఎల్ టెక్, కొటక్ మహీంద్రా ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో జీ ఎంటర్టైన్మెంట్, భారతీ ఇన్ఫ్రాటెల్, గ్రాసిమ్, వేదాంత, హిండాల్కో ఉన్నాయి.
కరోనా వైరస్ ప్రభావం.. మరిన్ని బిజినెస్ న్యూస్
యస్ బ్యాంకులో వాటాల కొనుగోలుపై ఎస్బీఐ కన్సార్టియంను ఏర్పాటు చేస్తుందనే నివేదికలన నేపథ్యంలో ఈ బ్యాంకు షేర్లు ఎగిశాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి నిఫ్టీ 13,500 మార్క్ చేరుకోవచ్చునని, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకులు భారీ లాభాల్లో ఉండవచ్చునని కొటక్ అంచనా వేసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 73.26 వద్ద ట్రేడ్ అయింది. బుధవారం 73.21 వద్ద క్లోజ్ అయింది.