భారీ నష్టాల్లో మార్కెట్లు, 150 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్
ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 32.62 (0.08%) పాయింట్లు నష్టపోయి 41273.41 వద్ద, నిఫ్టీ 12 పాయింట్లు (0.10 శాతం) నష్టపోయి 12126 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించింది. 420కి పైగా షేర్లు లాభాల్లో, 211 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 38 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.
కియాపై అప్పుడు మరింత క్లారిటీ..: జగన్ ప్రభుత్వం ఏం చెబుతోంది
మధ్యాహ్నం గం.11.46 సమయానికి సెన్సెక్స్ 183.65 (0.44%) పాయింట్లు నష్టపోయి 41,122.38 వద్ద, నిఫ్టీ 47.90 (0.39%) పాయింట్లు కోల్పోయి 47.90 (0.39%) వద్ద ట్రేడయింది. ఆటో, ఎనర్జీ, ఇన్ఫ్రా.. ఇలా అన్నిరంగాల షేర్లు కూడా నష్టాల్లో ప్రారంభమయ్యాయి. FMCG, ఐటీ, ఫార్మా రంగాల షేర్లు ఎక్కువగా కొనుగోళ్లు చేస్తున్నారు.
హీరో మోటో కార్ప్, హెచ్సీసీ, టాటా టెలీ సర్వీసెస్, యస్ బ్యాంకు షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. మధ్యాహ్నం సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో జీ ఎంటర్టైన్మెంట్, యస్ బ్యాంకు, ఎన్టీపీసీ, సన్ ఫార్మా, యూపీఎల్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో ఐచర్ మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంకు, బీపీసీఎల్, రిలయన్స్, ఐవోసీ ఉన్నాయి.