అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ అక్టోబర్ 30న దక్షిణ కొరియాలో కీలక సమావేశం కానున్నారు. ఈ భేటీలో రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నట్లు అంతర్జాతీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీని ప్రభావంతో ఆసియా మార్కెట్లు, వాల్ స్ట్రీట్ సూచికలు సానుకూల ధోరణిని ప్రదర్శిస్తున్నాయి. ఇది ఈ సంవత్సరం జరుగుతున్న ఐదవ రౌండ్ అమెరికా-చైనా వాణిజ్య చర్చల తర్వాతి దశగా చెప్పుకోవచ్చు. ఇటీవల మలేషియా రాజధాని కౌలాలంపూర్లో రెండు రోజుల పాటు జరిగిన చర్చల్లో ఇరుపక్షాల వాణిజ్య ప్రతినిధులు తాత్కాలిక సమన్వయానికి వచ్చారని, తద్వారా తాజా ఉద్రిక్తతలకు విరామం లభించిందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఆర్థిక సంస్థ నోమురా తన విశ్లేషణలో, రెండు వారాల క్రితం ఊహించిన ఫలితాలకు ఇది దగ్గరగా ఉందని తెలిపింది. ఇరుపక్షాలు ఒకరి సరిహద్దులను పరీక్షించిన తర్వాత, చివరికి పరస్పర రాయితీలు ఇచ్చే అవకాశముందని పేర్కొంది. నోమురా ప్రకారం APEC శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ట్రంప్-జిన్పింగ్ సమావేశం జరగడం, తాత్కాలిక కాల్పుల విరమణ పొడిగింపుకు దారి తీసే అవకాశం ఉందని తెలిపింది.

అయితే ఈ సమావేశంలో పూర్తి వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఆ సంస్థ హెచ్చరించింది. అధ్యక్షుడు Trump పూర్తి స్థాయి ఒప్పందాన్ని కోరుకున్నప్పటికీ, వాస్తవానికి రెండు దేశాలు తాత్కాలిక, పరిమిత అంశాలపై మాత్రమే అంగీకరించే అవకాశం ఉంది. అమెరికా ప్రకటించిన 100 శాతం సుంకం అమలు కావడం కష్టమే. గరిష్టంగా 90 రోజుల టారిఫ్ విరమణను పొడిగించవచ్చని నోమురా పేర్కొంది.
జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ సంస్థ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వికే విజయకుమార్ మాట్లాడుతూ.. అమెరికా-చైనా మధ్య సుంకాలపై ఒప్పందం సాధ్యమని చెప్పారు. గురువారం జరిగే ట్రంప్-జిన్పింగ్ సమావేశంలో పురోగతి కనబడితే ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు మరింత ఉత్సాహంగా మారతాయి. ముఖ్యంగా S&P 500, నిక్కీ, కోస్పి వంటి సూచికలు రికార్డు స్థాయిలోకి వెళ్లే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
అదనంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల తగ్గింపు అంచనాలు మార్కెట్లకు తాత్కాలిక సానుకూల సంకేతాలుగా పనిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.యుఎస్ CPI ద్రవ్యోల్బణం 3 శాతం వద్దనే ఉండటం, వడ్డీ రేట్లపై ఒత్తిడి తగ్గిస్తుంది. ఇది కూడా ఈ వారంలో జరిగే FOMC సమావేశానికి మార్కెట్ సానుకూలంగా స్పందించేలా చేస్తుందని అన్నారు.
ఇక భారత మార్కెట్ల విషయానికి వస్తే మెహతా సెక్యూరిటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సే మాట్లాడుతూ.. ట్రంప్-జిన్పింగ్ సమావేశంపై పెట్టుబడిదారుల్లో ఆశావాదం పెరిగింది. ఈ సానుకూల ధోరణి కారణంగా నిఫ్టీ స్వల్ప పాజిటివ్ బైయస్తో ట్రేడయ్యే అవకాశం ఉందని తెలిపారు. క్లుప్తంగా చెప్పాలంటే అక్టోబర్ 30న జరగనున్న ట్రంప్-జిన్పింగ్ భేటీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలక మలుపు కానుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ సమావేశం తాత్కాలిక వాణిజ్య విరమణకు దారి తీసినా, పెట్టుబడిదారులకు ఇది తాత్కాలిక ఊరటగా మారవచ్చు.
More From GoodReturns

Iran war: కేవలం గ్యాస్ ఒక్కటే కాదు.. ఈ 5 రంగాలపై భారీ ఎఫెక్ట్ ఉండే అవకాశం?

Iran war: త్వరలోనే యుద్ధం ముగింపు? ట్రంప్ వ్యాఖ్యలతో చమురు ధరల్లో భారీ మార్పు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications