స్టాక్ మార్కెట్లు సోమవారం (మే 9) భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ప్రధానంగా అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు దేశీయ మార్కెట్ పైన ప్రభావం చూపాయి. దీంతో సూచీలు నష్టాలతో ఈ వారాన్ని ప్రారంభించాయి. అన్ని రంగాలు కూడా నష్టాలను నమోదు చేస్తున్నాయి. పీఎస్యూ బ్యాంకు సూచీ అయితే ఏకంగా 2 శాతం క్షీణించింది. ఇటీవల ఆర్బీఐ రెపో రేటును పెంచింది. ఫెడ్ కూడా వడ్డీ రేట్లు పెంచుతోంది. అంతర్జాతీయంగా ఇతర కేంద్ర బ్యాంకులు ఇదే దారిలో నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సూచీలు నేల చూపులు చూస్తున్నాయి.

కారణాలివే
అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. అమెరికా మార్కెట్లు గతవారం భారీ నష్టాలతో ముగించాయి. నేడు ఆసియా-పసిఫిక్ మార్కెట్లు కూడా ప్రతికూలంగా ట్రేడ్ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్భణం పెరుగుతోంది. ఇది కేంద్ర బ్యాంకులు ద్రవ్య విధానాన్ని కఠినతరం చేయడానికి కారణమవుతుంది. ఇది సూచీలను ఒత్తిడిలోకి నెట్టింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం, చైనాలో కఠిన లాక్ డౌన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం నెమ్మదిస్తుందనే అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వివిధ కంపెనీల త్రైమాసిక ఫలితాలు కూడా ప్రతికూలంగా మారాయి.

సెన్సెక్స్ పతనం
సెన్సెక్స్ ఉదయం 54,188 పాయింట్ల వద్ద ప్రారంభమై, 54,365 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 53,918 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ ఉదయం గం.10.45 సమయానికి 623 పాయింట్లు లేదా 1.15 శాతం క్షీణించి 54,205 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 181 పాయింట్లు లేదా 1.11 శాతం క్షీణించి 16,228 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.
సెన్సెక్స్ ఓ సమయంలో 950 పాయింట్ల వరకు క్షీణించింది.
సెన్సెక్స్ 30లో పవర్ గ్రిడ్ మాత్రమే లాభాల్లో ఉంది. టాప్ గెయినర్స్ జాబితాలో బజాజ్ ఫిన్ సర్వ్, యూపీఎల్, పవర్ గ్రిడ్ కార్ప్, హెచ్సీఎల్ టెక్, బజాజ్ ఆటో ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో ఇండస్ఇండ్ బ్యాంకు, టెక్ మహీంద్రా, రిలయన్స్, జేఎస్డబ్ల్యు స్టీల్, టాటా స్టీల్ ఉన్నాయి.

రూపాయి ఆల్ టైమ్ కనిష్టం
గతవారం మార్కెట్లు భారీగా నష్టపోవడంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2.85 లక్షల కోట్లు క్షీణించింది. నేడు కూడా భారీగానే తగ్గింది. ఇదిలా ఉండగా డాలర్ మారకంతో రూపాయి ఆల్ టైమ్ కనిష్టం 77.42 స్థాయికి చేరుకుంది. యూఎస్ బాండ్ యీల్డ్స్ పెరగడంతో డాలర్ ఇండెక్స్ 20 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది.
More From GoodReturns

ఇరాన్ యుద్దం భారత్కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications