Stock Market: భారీ లాభాల్లో ముగిసిన Sensex, Nifty.. కొత్త రికార్డుల మోత..
Market Closing: ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు రోజంతా అదే జోష్ కొనసాగించాయి. దీంతో నెల చివరి రోజును మార్కెట్లు భారీ లాభాల నడుమ ముగించాయి.
బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 803 పాయింట్ల లాభంతో ప్రయాణాన్ని ముగించగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 217 పాయింట్ల మేర లాభంలో ముగిసింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 420 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 233 పాయింట్ల మేర లాభపడింది. మార్కెట్లు లాభాలను విస్తరించటంతో నిఫ్టీ, సెన్సెక్స్ సూచీలు కొత్త జీవితకాల గరిష్ఠాలను చేరుకున్నాయి.

మార్కెట్లు ముగిసే సమయానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండెక్స్ 2.5 శాతం, పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 2 శాతం పెరగడంతో అన్ని రంగాల సూచీలు గ్రీన్లో ముగిశాయి. ఇదే క్రమంలో ఆటో, క్యాపిటల్ గూడ్స్ సూచీలు దాదాపు 2 శాతం చొప్పున పెరిగాయి.
మార్కెట్లు ముగిసే నాటికి మహీంద్రా అండ్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా, హీరో మోటార్స్, టీసీఎస్, మారుతీ, బజాజ్ ఆటో, ఎల్ టి, టెక్ మహీంద్రా, విప్రో, పవర్ గ్రిడ్, కోల్ ఇండియా, హచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఓఎన్జీసీ, ఐషర్ మోటార్స్ కంపెనీల షేర్లు లాభాల్లో ప్రయాణాన్ని ముగించి ఎన్ఎస్ఈలో టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, గ్రాసిమ్, అపోలో హాస్పిటల్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, దివీస్ ల్యాబ్స్, ఐసీఐసీఐ బ్యాంక్, బీపీసీఎల్, ఎన్టీపీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications