బడ్జెట్‌కు రెండ్రోజుల ముందు.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం ప్రారంభమే నష్టాలతో ప్రారంభించాయి. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీన 2020-21 బడ్జెట్‌ను ప్రవేశ పెడుతోంది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఈ బడ్జెట్ పైన అన్ని రంగాలు ఆశలు పెట్టుకున్నాయి. మందగమనం కారణంగా డిమాండ్, వినియోగం పెంచేలా నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఉంటుందని భావిస్తున్నారు. బడ్జెట్‌లో సానుకూలతలు ఉంటాయని బుధవారం లాభాల్లో ముగిసిన మార్కెట్లు ఈరోజు మాత్రం నష్టాల్లో ప్రారంభమై, నష్టాల్లోనే ముగిశాయి.

ఉదయం గం.9.45 సమయానికి సెన్సెక్స్ 100 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 12,100 మార్క్ దిగువన ప్రారంభమైంది. మధ్యాహ్నం గం.3.35 సమయానికి సెన్సెక్స్ 284.84 (0.69%) పాయింట్ల నష్టంతో 40,913.82 వద్ద, నిఫ్టీ 104.05 (0.86%) పాయింట్లు దిగజారి 12,025.45 వద్ద ఉంది. ఆ తర్వాత సెన్సెక్స్ 285 పాయింట్ల నష్టంతోనే ముగిసింది. నిఫ్టీ 94 పాయింట్ల నష్టంతో ముగిసింది.

Market Updates: Sensex falls 300 pts, Nifty tests 12K

టాప్ గెయినర్స్ జాబితాలో బజాజ్ ఆటో, ఐసీఐసీఐ బ్యాంకు, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, ఐచర్ మోటార్స్, ఏషియన్ పేయింట్స్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో యస్ బ్యాంకు, జాజ్ ఫిన్ సర్వ్, విప్రో, రిలయన్స్, జీ ఎంటర్ట్నైమెంట్ ఉన్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+