భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, తీవ్ర ఒత్తిడిలో ఐటీ షేర్లు

ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమైన, నష్టాల్లోకి వెళ్లాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 30.19 పాయింట్లు లేదా 0.08% పెరిగి 38,523.14 వద్ద, నిఫ్టీ 5.00 పాయింట్లు లేదా 0.04% ఎగిసి 11,305.50 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ప్రారంభంలో 624 షేర్లు లాభాల్లో, 312 షేర్లు నష్టాల్లో ఉండగా, 54 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. అయితే ఆ తర్వాత కాసేపటికి మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లాయి. మధ్యాహ్నం గం.1.15 సమయానికి సెన్సెక్స్ 187 పాయింట్లు నష్టపోయి 38,305 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 11,300 కంటే కిందకు పడిపోయింది. డాలర్ మారకంతో ఇండియన్ రూపాయి 74.83 వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైంది. మంగళవారం 74.83 ఇదే ధర వద్ద క్లోజ్ అయింది.

ఒత్తిడిలో ఐటీ షేర్లు

ఒత్తిడిలో ఐటీ షేర్లు

మధ్యాహ్నం గం.11.30 సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో టాటా స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంకు, గ్రాసీమ్, జేఎస్‌డబ్ల్యు స్టీల్, భారతీ ఇన్ఫ్రాటెల్ ఉన్నాయి టాప్ లూజర్స్ జాబితాలో నెస్ట్లె, హెచ్‌సీఎల్ టెక్, రిలయన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్ ఉన్నాయి. రెండు రోజుల పాటు దూసుకెళ్లిన ఐటీ షేర్లు ఈ రోజు నష్టాల్లోకి జారుకున్నాయి. ఐటీ షేర్లు ఒత్తిడిలో కూరుకుపోయాయి. ఇండస్ ఇండ్ బ్యాంకు క్వార్టర్ 1 ఫలితాల్లో 68 శాతం లాభాలు క్షీణించినప్పటికీ, నికర ఎన్పీఏలు 1.23 శాతం నుండి 0.86 శాతానికి తగ్గాయి. దీంతో ఈ షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. టాటా కాఫీ నికర లాభం 62 శాతం దూసుకెళ్లింది. నికర అమ్మకాలు 26 శాతం పెరిగాయి. దీంతో టాటా కాఫీ షేర్లు ఎగిశాయి.

కంపెనీల ఫలితాలు

కంపెనీల ఫలితాలు

ఈ రోజు 180 కంపెనీలు తమ క్వార్టర్ ఫలితాలను విడుదల చేయనున్నాయి. బారతీ ఎయిర్‌టెల్, మారుతీ సుజుకీ వంటి సంస్థలు ఇందులో ఉన్నాయి. కరోనా - లాక్ డౌన్ నేపథ్యంలో అన్ని రంగాలు, అన్ని కంపెనీలపై ప్రభావం పడింది. ఇప్పటికే వివిధ సంస్థల ఆదాయం తగ్గింది. పలు కంపెనీల ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

మరిన్ని కారణాలు..

మరిన్ని కారణాలు..

కరోనా కేసులు పెరగడంపై ఇన్వెస్టర్లు ఆందోళనగా ఉన్నారు. దేశంలోని ప్రధాన నగరాలు ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, పుణే, బెంగళూరు, అహ్మదాబాద్‌లు కరోనాను ఎక్కువగా ఎదుర్కొంటున్నాయి.అంతర్జాతీయంగా కేంద్ర బ్యాంకుల ఉద్దీపన ప్యాకేజీలు, కరోనా కేసులు పెరగడం వంటివి గ్లోబల్ మార్కెట్లలో నష్టాలకు కారణమయ్యాయి. ఈ ప్రభావం మన మార్కెట్లపై పడింది.

కేంద్ర బ్యాంకు ఆగస్ట్ వరకు లోన్ మారటోరియం వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ నుండి ఈఎంఐ తిరిగి ప్రారంభం కానుంది. లోన్ మారటోరియం పొడిగింపు ఉంటుందా, పొడిగింపు ఉన్నప్పటికీ.. లేకపోయినప్పటికీ బ్యాంకులపై ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. అలాగే సెప్టెంబర్ నుండి ప్రారంభం కానున్న ఈఎంఐ మారటోరియంను పొడిగించాలని కూడా కోరుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+