దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ప్రారంభమై, ఆ తర్వాత నష్టాల్లోకి వెళ్లి, ఆ తర్వాత పరుగులు పెట్టాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావంతో గతవారం సూచీలు భారీగా నష్టపోయాయి. క్రితం సెషన్లో సెన్సెక్స్ ఏకంగా 1600 పాయింట్లకు పైగా నష్టపోయింది. మొత్తంగా గతవారం 2500 పాయింట్లకు పైగా క్షీణించింది. ఒమిక్రాన్ ప్రభావం మార్కెట్లపై నేడు కూడా కనిపించింది. అయితే ఇది కేవలం ఉదయానికే పరిమితమైంది. ఉదయం ఓ సమయంలో 100 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ మధ్యాహ్నం గం.11 తర్వాత భారీ లాభాల్లోకి వచ్చాయి. నష్టం కాసేప మాత్రమే కనిపించింది. ఆ తర్వాత అంతకంతకూ లాభపడింది.
ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా దారిలో రిలయన్స్ జియో టారిఫ్ పెంపు, ప్రయివేటు బ్యాంకుల్లో ప్రమోటర్ల వాటాపై ఆర్బీఐ సానుకూల ప్రతిపాదనలు, ముడి చమురు ధరలు తగ్గడం, వివిధ దేశాల కరెన్సీలు కోలుకోవడం వంటి పరిణామాలు సూచీలకు కలిసి వ చ్చినట్లుగా కనిపించాయి. తొలుత ఒమిక్రాన్ భయాలు కనిపించినప్పటికీ, పై అంశాలు ఒమిక్రాన్ భయాలను అధిగమించాయి. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొవిడ్ కొత్త వేరియంట్ క్రమంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే ఏ దేశానికి ఆ దేశం కట్టడి చర్యలు తీసుకోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది.

సెన్సెక్స్ మధ్యాహ్నం గం.2 సమయానికి 469.04 (0.82%) పాయింట్లు లాభపడి 57,561.66 పాయింట్ల వద్ద, నిఫ్టీ 122.15 (0.72%) పాయింట్లు ఎగిసి 17,148.60 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. సెన్సెక్స్ నేడు 57,028.04 పాయింట్ల వద్ద ప్రారంభమై, 57,616.67 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 56,382.93 పాయింట్లవద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,055.80 పాయింట్ల వద్ద ప్రారంభమై 17,160.70 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 16,782.40 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ నేడు ఓ సమయంలో 700 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఆ తర్వాత 400 పాయింట్లకు పైగా లాభపడింది. మధ్యాహ్నం వరకు దాదాపు 1300 పాయింట్ల మేర పైకి, కిందకు కదలాడింది.
More From GoodReturns

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

Stock market: మార్కెట్ షాక్ ఇచ్చినా భయం వద్దు.. ఇన్వెస్టర్లకు ఇవే సేఫ్ ఆప్షన్లు!

BSE: స్టాక్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్.. సెన్సెక్స్లోనే కాకుండా ఇకపై వీటిలోనూ ట్రేడింగ్ చేయెచ్చు!

Investment: మార్కెట్ ఒడిదుడుకులకు భయపడుతున్నారా? ఈ టైంలో ధనవంతులు ఏం చేస్తారో తెలుసా?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..



Click it and Unblock the Notifications