ముంబై: దీపావళి పండుగ తర్వాత మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మంగళవారం కొనసాగిన మార్కెట్ జోరు బుధవారం కూడా కనిపించింది. సెన్సెక్స్ 40,000 మార్క్ దాటింది. మధ్యాహ్నం గం.12.46 నిమిషాలకు సెన్సెక్స్ 40,064 పాయింట్ల వద్ద ఉంది. కార్పోరేట్ పన్ను తగ్గింపు అనంతరం కేంద్రం మరిన్ని ఉద్దీపన చర్యలు తీసుకుంటుందనే సంకేతాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను పెంచాయి. దీంతో మార్కెట్లు దూకుడు పెంచుతున్నాయి.
మధ్యాహ్నం గం.12.46 నిమిషాలకు సెన్సెక్స్ 236.87 (0.59%) లాభపడి 40,068.71 మార్కు చేరుకుంది. నిఫ్టీ గం.12.49 సమయానికి 55.50 (0.47%) పాయింట్లు ఎగిసి 11,842.35 వద్ద ట్రేడ్ అయింది. జూలై నెల తర్వాత సెన్సెక్స్ 40,000 మార్క్ దాటడం ఇదే తొలిసారి. త్రైమాసిక ఫలితాలు సానుకూలంగా ఉండటం, చైనాతో తొలిదశ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోనున్నామని ట్రంప్ చెప్పడం వంటి కారణాలు కూడా మార్కెట్కు ఊతమిచ్చాయి.

దీర్ఘకాల మూలధన లాభాల పన్ను (LTCG), స్వల్పకాల మూలధన లాభాల పన్ను (STCG), డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (DDT)ని తగ్గించేందుకు ప్రభుత్వం యోచిస్తోందని తెలుస్తోంది. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ఆర్థిక మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతోందని వార్తలు రావడం మార్కెట్లు లాభాల్లోకి వెళ్లాడనికి కారణమయ్యాయి.
టాప్ గెయినర్స్ లిస్టులో ఐటీసీ, ఎస్బీఐ, భారతీ ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, హిండాల్కో ఉన్నాయి. టాప్ లూజర్స్ లిస్టులో బ్రిటానియా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, యూపీఎల్, కోల్ ఇండియా ఉన్నాయి.
మంగళవారం కూడా మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ ముగిశాయి. కేంద్రం మరోసారి ఉద్దీపన పథకాలు ప్రకటించనుందనే వార్తలు నిన్న కూడా ఇన్వెస్టర్లను కొనుగోళ్లు జరిపేలా చేసాయి. సంవత్ 2076 తొలి సెషన్ ప్రారంభంలో లాభాలబాటపట్టిన 30 షేర్ల ఇండెక్స్ సెన్సెక్స్ ఏ దశలోనూ వెనక్కి తిరిగి చూసుకోలేదు. మంగళవారం ఓ దశలో 666 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్ చివరకు 581.64 పాయింట్లు లేదా 1.48 శాతం లాభంతో క్లోజ్ అయింది. దీంతో మార్కెట్ నాలుగు నెలల గరిష్ఠ స్థాయిని తాకింది. నిఫ్టీ కూడా 159.70 పాయింట్లు లేదా 1.37 శాతం ఎగిసి 11,786.85 వద్ద స్థిరపడింది.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..



Click it and Unblock the Notifications