ముంబై: దీపావళి పండుగ తర్వాత మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మంగళవారం కొనసాగిన మార్కెట్ జోరు బుధవారం కూడా కనిపించింది. సెన్సెక్స్ 40,000 మార్క్ దాటింది. మధ్యాహ్నం గం.12.46 నిమిషాలకు సెన్సెక్స్ 40,064 పాయింట్ల వద్ద ఉంది. కార్పోరేట్ పన్ను తగ్గింపు అనంతరం కేంద్రం మరిన్ని ఉద్దీపన చర్యలు తీసుకుంటుందనే సంకేతాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను పెంచాయి. దీంతో మార్కెట్లు దూకుడు పెంచుతున్నాయి.
మధ్యాహ్నం గం.12.46 నిమిషాలకు సెన్సెక్స్ 236.87 (0.59%) లాభపడి 40,068.71 మార్కు చేరుకుంది. నిఫ్టీ గం.12.49 సమయానికి 55.50 (0.47%) పాయింట్లు ఎగిసి 11,842.35 వద్ద ట్రేడ్ అయింది. జూలై నెల తర్వాత సెన్సెక్స్ 40,000 మార్క్ దాటడం ఇదే తొలిసారి. త్రైమాసిక ఫలితాలు సానుకూలంగా ఉండటం, చైనాతో తొలిదశ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోనున్నామని ట్రంప్ చెప్పడం వంటి కారణాలు కూడా మార్కెట్కు ఊతమిచ్చాయి.

దీర్ఘకాల మూలధన లాభాల పన్ను (LTCG), స్వల్పకాల మూలధన లాభాల పన్ను (STCG), డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (DDT)ని తగ్గించేందుకు ప్రభుత్వం యోచిస్తోందని తెలుస్తోంది. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ఆర్థిక మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతోందని వార్తలు రావడం మార్కెట్లు లాభాల్లోకి వెళ్లాడనికి కారణమయ్యాయి.
టాప్ గెయినర్స్ లిస్టులో ఐటీసీ, ఎస్బీఐ, భారతీ ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, హిండాల్కో ఉన్నాయి. టాప్ లూజర్స్ లిస్టులో బ్రిటానియా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, యూపీఎల్, కోల్ ఇండియా ఉన్నాయి.
మంగళవారం కూడా మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ ముగిశాయి. కేంద్రం మరోసారి ఉద్దీపన పథకాలు ప్రకటించనుందనే వార్తలు నిన్న కూడా ఇన్వెస్టర్లను కొనుగోళ్లు జరిపేలా చేసాయి. సంవత్ 2076 తొలి సెషన్ ప్రారంభంలో లాభాలబాటపట్టిన 30 షేర్ల ఇండెక్స్ సెన్సెక్స్ ఏ దశలోనూ వెనక్కి తిరిగి చూసుకోలేదు. మంగళవారం ఓ దశలో 666 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్ చివరకు 581.64 పాయింట్లు లేదా 1.48 శాతం లాభంతో క్లోజ్ అయింది. దీంతో మార్కెట్ నాలుగు నెలల గరిష్ఠ స్థాయిని తాకింది. నిఫ్టీ కూడా 159.70 పాయింట్లు లేదా 1.37 శాతం ఎగిసి 11,786.85 వద్ద స్థిరపడింది.
More From GoodReturns

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

మార్కెట్ క్రాష్ సమయంలో ఇన్వెస్టర్లకు నగదు చాలా కీలకం.. రాబర్ట్ కియోసాకి సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications