ముంబై: కరోనా వైరస్ ప్రభావంతో అంతర్జాతీయ, ఆసియా మార్కెట్లు సోమవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. చైనీస్ మార్కెట్లు 9 శాతం మేర నష్టపోయాయి. కరోనాతో పాటు బడ్జెట్ ఆశించిన మేర లేకపోవడంతో భారత మార్కెట్లు కూడా నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 09:17 సమయానికి సెన్సెక్స్ 89.46 (0.23%) పాయింట్లు నష్టపోయి 39,646.07 వద్ద, నిఫ్టీ 17.20 (0.15%) పాయింట్లు నష్టపోయి 11,644.70 వద్ద ప్రారంభమైంది. 354 షేర్లు లాభాల్లో, 352 షేర్లు నష్టాల్లో ఉండగా 43 షేర్లలో మార్పులేదు. IOC, కోల్ ఇండియా, ఏషియన్ పెయింట్స్, HUL, BPCL, LIC హౌసింగ్ ఫైనాన్స్ లాభాల్లో ట్రేడ్ కాగా, ITC, HDFC, పవర్ గ్రిడ్, రిలయన్స్ నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. టాటా మోటార్స్ షేర్లు 2% నష్టంతో ప్రారంభమయ్యాయి.
ఆటో, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ఐటీ, మెటల్, ఫార్మా రంగాలు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. గత ఏడాది సెప్టెంబర్ మందగమనం నుంచి ఆటో మొబైల్ కంపెనీలు మూడో త్రైమాసికంలో కోలుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఏజీఆర్పై నేడు విచారణ నేపథ్యంలో ఎయిర్టెల్ షేర్లు నష్టపోతున్నాయి. సిగరెట్ల ధరలు పెరుగనున్నందున ఐటీసీ నష్టపోతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 71.63 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించింది.

స్టాక్ మార్కెట్ గ్రాఫ్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన శనివారం నాడు భారీగా నష్టపోయింది. ఇలా దిగజారడం 11 సంవత్సరాల తర్వాత ఇదే తొలిసారి. పైగా అది బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టే రోజే కావడం మార్కెట్ వర్గాలను దిగ్భ్రాంతిలోకి ముంచెత్తింది. కొన్ని గంటల వ్యవధిలో సెన్సెక్స్ ఏకంగా 988 పాయింట్లను కోల్పోయింది. 40 వేల మార్క్కు దిగజారింది. నిఫ్టీ 11,700 మార్క్ సమీపంలో నిలిచిపోయింది.
More From GoodReturns

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

కుప్పకూలిన ఆసియా స్టాక్ మార్కెట్.. దెబ్బకు దక్షిణ కొరియా మార్కెట్లో నిలిచినపోయిన ట్రేడింగ్..

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!



Click it and Unblock the Notifications